జార్జి రెడ్డి సినిమా ట్రైలర్ ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది.సినిమా ఇండ్రస్ట్రీ అంతా దానిమీదే చర్చించుకుంటున్నారు.
విడుదల కాక ముందే ఈ సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి.ఇక ఈ సినిమా మీద ముందు నుంచి చిరంజీవి తమ్ముడు సానుకూలంగా స్పందిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నవంబరు 22న విడుదలవుతున్న నేపథ్యంలో నాగబాబు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.ట్రైలర్ చాలా బాగుందని బయోపిక్ అంటే ఇదీ అంటూ నాగబాబు మెచ్చుకున్నారు.
ఈ మేరకు తన యూట్యూబ్ ఛానెల్ లో వీడియో ను నాగబాబు విడుదల చేశారు.
జార్జి రెడ్డి సినిమా యూనిట్ ను తాను స్వయంగా కలిసి మరీ అభినందనలు తెలపాలని చేస్తున్నాని చెప్పారు.
అంతేకాదు జార్జి రెడ్డి బయోపిక్ను పవన్ కళ్యాణ్ కానీ, వరుణ్ తేజ్తో కానీ తీస్తే బాగుంటుందని చాలాసార్లు అనుకున్నానని చెప్పారు నాగబాబు.కానీ ఇంతలోనే జీవన్ రెడ్డి ఆ సినిమాను తీసేశారని నాగబాబు ఆ వీడియోలో చెప్పుకొచ్చారు.
జార్జి రెడ్డి పోస్టర్లు చూసినప్పుడల్లా తనకు పవన్ గుర్తుకు వస్తున్నాడని నాగబాబు అన్నారు.
కానీ ట్రైలర్ చుసిన తరువాత ఆ సినిమాకు పేరున్న నటుడు కంటే చిన్న హీరోనే బెటర్ అనిపించింది.
ఇప్పటి వరకు చిన్నచిన్న పాత్రలు చేసిన సందీప్ మాధవ్ జార్జి రెడ్డి పాత్రకు బాగా సెట్ అయ్యాడని, జార్జి రెడ్డి గొప్ప వ్యక్తి.ఆయన బతికిఉంటే ఏదో ఒక రాష్ట్రానికి సీఎం అయ్యేవారు అంటూ నాగబాబు ప్రశంసించారు.
ఇక ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ ఈ నెల 17 న నిర్వహించబోతున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పవన్ కళ్యాణ్ హాజరుకాబోతున్నట్టు తెలుస్తోంది.