గాంధీజీని చంపిన నాథూరామ్ గాడ్సేను గొప్పదేశ భక్తుడిగా అభివర్ణిస్తూ నిన్న ఆయన పుట్టిన రోజు సందర్బంగా నాగబాబు వరుస ట్వీట్స్ చేసిన విషయం తెల్సిందే.ఈ విషయమై దుమారం రేగింది.
జాతిపితను చంపిన గాడ్సేను దేశ భక్తుడు అంటూ పొగడ్తలు గుప్పించడం ఏంటీ అంటూ కొందరు తీవ్ర స్థాయిలో మండి పడ్డారు.ఈ విషయంలో నాగబాబు వెంటనే జాతికి క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేశారు.
తనపై వస్తున్న విమర్శలకు నాగబాబు స్పందించాడు.నేను ఆయన చేసిన నేరం గురించి ప్రస్తావించలేదు.అతడి అభిప్రాయాలను అప్పట్లో మీడియా ప్రజలకు తెలియజేయలేదు.ఏకపక్షంగా మీడియా వ్యవహరించింది అన్నాను.
ఆయన అభిప్రాయం అందరికి తెలియాల్సి ఉందని చెప్పాను తప్ప మరో ఉద్దేశ్యం ఏమీ లేదని ఈ సందర్బంగా నాగబాబు మరో ట్వీట్లో పేర్కొన్నాడు.అందరిలాగే నాకు కూడా మహాత్మాగాంధీ అంటే చాలా అభిమానం అని, ఆయన వల్లే దేశంకు స్వాతంత్య్రం వచ్చిందని నాగబాబు అన్నాడు.
నాగబాబు ఉన్నట్లుండి నాథూరామ్ గాడ్సే చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నీయాంశం అవుతున్న నేపథ్యంలో ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం ఇలా చేస్తున్నాడు అంటూ కొందరు ఆరోపిస్తున్నారు.నాగబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల రాజకీయంగా బలహీన పడటం తప్ప బలం పొందడం సాధ్యం కాదని ఈ సందర్బంగా నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.