అయ్యో నా ఉద్దేశ్యం వేరు : వివాదాస్పద ట్వీట్‌పై వివరణ ఇచ్చిన నాగబాబు

గాంధీజీని చంపిన నాథూరామ్‌ గాడ్సేను గొప్పదేశ భక్తుడిగా అభివర్ణిస్తూ నిన్న ఆయన పుట్టిన రోజు సందర్బంగా నాగబాబు వరుస ట్వీట్స్‌ చేసిన విషయం తెల్సిందే.ఈ విషయమై దుమారం రేగింది.

 Nagababu, Nathuram Godse, Mahatma Gandhi, Nagababu Gives Clarity On Godse Tweet-TeluguStop.com

జాతిపితను చంపిన గాడ్సేను దేశ భక్తుడు అంటూ పొగడ్తలు గుప్పించడం ఏంటీ అంటూ కొందరు తీవ్ర స్థాయిలో మండి పడ్డారు.ఈ విషయంలో నాగబాబు వెంటనే జాతికి క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్‌ చేశారు.

తనపై వస్తున్న విమర్శలకు నాగబాబు స్పందించాడు.నేను ఆయన చేసిన నేరం గురించి ప్రస్తావించలేదు.అతడి అభిప్రాయాలను అప్పట్లో మీడియా ప్రజలకు తెలియజేయలేదు.ఏకపక్షంగా మీడియా వ్యవహరించింది అన్నాను.

ఆయన అభిప్రాయం అందరికి తెలియాల్సి ఉందని చెప్పాను తప్ప మరో ఉద్దేశ్యం ఏమీ లేదని ఈ సందర్బంగా నాగబాబు మరో ట్వీట్‌లో పేర్కొన్నాడు.అందరిలాగే నాకు కూడా మహాత్మాగాంధీ అంటే చాలా అభిమానం అని, ఆయన వల్లే దేశంకు స్వాతంత్య్రం వచ్చిందని నాగబాబు అన్నాడు.

Telugu Mahatma Gandhi, Nagababu, Nagababugodse, Nathuram Godse-

నాగబాబు ఉన్నట్లుండి నాథూరామ్‌ గాడ్సే చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నీయాంశం అవుతున్న నేపథ్యంలో ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం ఇలా చేస్తున్నాడు అంటూ కొందరు ఆరోపిస్తున్నారు.నాగబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల రాజకీయంగా బలహీన పడటం తప్ప బలం పొందడం సాధ్యం కాదని ఈ సందర్బంగా నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube