నాగవర్మను హీరోగా పరిచయం చేస్తూ ఏ బ్రాండ్ ఇండియా మూవీ మేకర్స్ సంస్థ ‘విక్రమ్’ పేరుతో ఓ ప్రేమ కధా చిత్రాన్ని నిర్మిస్తోంది.హరిచందన్ దర్శకత్వం వహిస్తున్నారు.
నాగవర్మ నిర్మిస్తున్నారు.హీరో నాగవర్మ సరసన దివ్యా రావు కథానాయికగా నటించింది.
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది.కాగా ఈ చిత్రం టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను ప్రముఖ దర్శకుడు తేజ హైదరాబాద్ లో ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా దర్వకుడు తేజ మాట్లాడుతూ ఫస్ట్ లుక్ ఆకర్షనీయంగా ఉంది అంటూ అభినందించాడు.సినిమా కూడా తప్పకుండా హిట్ అవ్వాలని ఆశిస్తున్నట్లుగా పేర్కొన్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు హరిచందన్ మాట్లాడుతూ “లవ్ థ్రిల్లర్ చిత్రమిది.ఓ సినిమా రచయిత ప్రేమకధ ఇది.తన ప్రేమను సాధించడం కోసం, ప్రేమించిన అమ్మాయిని పొందడం కోసం ఆ రచయిత ఏమి చేశాడన్నది ఆసక్తికరంగా చెప్పాం.ప్రేమకథా చిత్రాల్లో విభిన్నంగా ఉంటుంది.
అన్ని వర్గాల వారిని ఆకట్టుకోవడంతో పాటు యూత్ కు నచ్చే ఎలిమెంట్స్ ఎక్కువగా ఉన్నాయి.తప్పకుండా సినిమాను త్వరలోనే థియేటర్లలో విడుదల చేస్తాము” అని తెలిపారు.
హీరో, నిర్మాత నాగవర్మ మాట్లాడుతూ “థియేటర్లు ఓపెన్ చేసిన తర్వాత అనువైన తేదీ చూసుకుని చిత్రాన్ని విడుదల చేస్తాం.చిత్రం చాలా బాగా వచ్చింది.పాత్రధారులు అందరూ తమ తమ పాత్రల్లో ఎంతగానో ఒదిగిపోయారు.సినిమాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు” అని తెలిపారు.
నాగవర్మ, దివ్యా రావు జంటగా నటించిన ఈ చిత్రంలో ఆదిత్య ఓం, పృథ్వి రాజ్, సురేష్, చలపతిరాజు, ఖయ్యుమ్, సూర్య, జ్యోతి, తాగుబోతు రమేష్, టార్జాన్, ఫిష్ వెంకట్, చిత్రం బాష, భూపాల్ రాజు, డాన్స్ సత్య, జయవాణి తదితరులు ఇతర ముఖ్యతారాగణం.