టాలీవుడ్ లో లవర్ బాయ్ గా అమ్మాయిల కలల రాకుమారుడుగా అందరి దృష్టిని ఆకర్షించిన నటుడు నాగ శౌర్య.ఎక్కువగా ప్రేమ కథలతో మెప్పించిన నాగ శౌర్య ఈ మధ్య కాలంలో జోనర్ మార్చి కమర్షియల్ చిత్రాలపై దృష్టి పెట్టాడు.
తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ ని క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు.అయితే చలో సినిమాతో కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శౌర్యకి ఆ తరువాత మళ్ళీ ఆ స్థాయిలో హిట్ రాలేదు.
అశ్వద్ధామ సినిమాతో కొంత వరకు మెప్పించిన కూడా కమర్షియల్ హీరోగా మారాలనే తన ప్రయత్నం ఈ సారి గట్టిగా చేస్తున్నాడు.సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ కథతో సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్ సమయంలోనే పూర్తి చేసాడు.ఈ నేపధ్యంలో మరల తన మునుపటి రూపంలోకి మారిపోయి ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ మూవీ చేయడానికి రెడీ అయిపోయాడు.
సితార ఎంటర్టైన్మెంట్స్ లో లక్ష్మి సౌజన్య దర్శకత్వంలో ఓ రొమాంటిక్ లవ్ స్టోరీకి నాగ శౌర్య లాక్ డౌన్ కి ముందే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ తాజాగా స్టార్ట్ అయ్యింది.
ఈ సినిమాలో రీతూవర్మ శౌర్యకి జోడీగా నటిస్తుంది.మరో కీలక పాత్రలో స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నదియా నటిస్తుంది.
కరోనా నిబంధనలకి లోబడి ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో చేస్తున్నారు.ప్రధాన తారాగణం పాల్గొన్న కీలకమైన ఫామిలీ సన్నివేశాలని ప్రస్తుతం షూట్ చేస్తున్నారు.
మురళీ శర్మ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.