యంగ్ హీరో నాగశౌర్య ఇటీవల అశ్వధ్ధామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి యావరేజ్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాపై భారీ నమ్మకం పెట్టుకున్న నాగశౌర్య, సినిమా యావరేజ్ హిట్గా నిలవడంతో తన నెక్ట్స్ మూవీలపై ఫోకస్ పెట్టాడు.
అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఎలాంటి సినిమా పనులు జరగకపోవడంతో ఆయన ఇంటికే పరిమితం అయ్యాడు.
కాగా కరోనా ప్రభావం కారణంగా నాగశౌర్యకు గట్టి ఎదురుదెబ్బ తగిలేలా ఉందని అంటున్నాయి సినీ వర్గాలు.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నాగశౌర్య ఓ సినిమాను ఇప్పటికే ప్రారంభించి ఓ కీలక షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి చేశాడు.లక్ష్మీ సౌజన్య అనే లేడీ డైరెక్టర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా యూనిట్లో పలువురికి మనస్పర్థలు వచ్చినట్లు, అందుకే ఈ సినిమాను కొనసాగించే ఆలోచన లేదని చిత్ర వర్గాలు తెలుపుతున్నాయి.
ప్రస్తుతానికి బ్రేక్లో ఉన్న ఈ సినిమా షూటింగ్ పరిస్థితులు చక్కబడ్డాక పట్టాలెక్కుతుందా లేక అటకెక్కుతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.ఏదేమైనా ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.