టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య హీరోగా రీతూ వర్మ హీరోయిన్ గా ‘వరుడు కావలెను’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను మహిళా డైరెక్టర్ లక్ష్మి సౌజన్య డైరెక్ట్ చేసారు.
ఫ్యామిలీ మొత్తం ఒక చోట కూర్చుని చూసే విధంగా ఈ సినిమాను తెరకెక్కించారని మేకర్స్ తెలిపారు.ఇక ఈ సినిమా టైటిల్ ప్రకటించినప్పటి నుండే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.
ఇప్పటికే విడుదల అయినా టీజర్, పోస్టర్స్ అన్నిటిలో కూడా నాగ శౌర్య లుక్ అదిరి పోయింది.యూత్ ను ఆకట్టుకునే విధంగా నాగ శౌర్య లుక్ ఉండడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా ఈ మధ్యనే షూటింగ్ ముగించుకుని విడుదలకు సిద్ధం అయ్యింది.కరోనా కారణంగా ఈ సినిమా ఆలస్యం అవ్వడంతో ఇప్పటి వరకు విడుదల కాలేక పోయింది.
సెకండ్ వేవ్ తర్వాత ఈ సినిమా షూటింగ్ ను జెట్ స్పీడ్ తో ముగించి దసరా రేస్ లోకి నిలిపారు.అక్టోబర్ 15న థియేటర్స్ లోనే ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.
కానీ ఇప్పుడు ఈ సినిమా దసరా రేస్ నుండి తప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.దసరా కు పెద్ద సినిమాలు లేకపోయినప్పటికీ చిన్న సినిమాలు మాత్రం క్యూ కడుతుండడంతో ఈ సినిమా రేస్ నుండి తప్పుకోబోతుందని టాక్.
దసరా రేస్ లో ఇప్పటికే శర్వానంద్ మహాసముద్రం, అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, రాఘవేంద్ర రావు పెళ్లి సందD సినిమాలు రిలీజ్ అవుతుండడంతో ఈ సినిమా వాయిదా వేయాలని మేకర్స్ అనుకుంటున్నట్టు తెలుస్తుంది.దసరా తర్వాత పోటీ లేకుండా నవంబర్ మొదటి వారంలో ఈ సినిమాను రిలీజ్ చెయ్యాలని భావిస్తున్నారని వార్తలు అయితే వస్తున్నాయి.మరి చూడాలి ఈ విషయంపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో.