టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య ప్రస్తుతం ‘వరుడు కావలెను’ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా మహిళా డైరెక్టర్ లక్ష్మి సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కుతుంది.
ఇందులో నాగ సౌర్య కు జోడీగా రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తుంది.ఇప్పటికే విడుదల అయిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ అన్ని కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
ఈ సినిమా ఈ మధ్యనే షూటింగ్ ముగించుకుని విడుదలకు సిద్ధం అయ్యింది.
కరోనా కారణంగా ఈ సినిమా ఆలస్యం అవ్వడంతో ఇప్పటి వరకు విడుదల కాలేక పోయింది.సెకండ్ వేవ్ తర్వాత ఈ సినిమా షూటింగ్ ను జెట్ స్పీడ్ తో ముగించారు.ఇక ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు.
ఈ సినిమా టైటిల్ వినగానే ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్ కు దగ్గరగా ఉందని అనిపించింది.దర్శకురాలు కూడా ఈ సినిమాను లవ్ అండ్ ఎమోషన్స్ కలగలిపిన అందమైన కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కించారు.
ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉన్నారు.ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ ప్రకటించింది.
దసరా కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేసారు.అక్టోబర్ 15న థియేటర్స్ లోనే ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు మేకర్స్ తెలిపారు.
ఇక ఈ మేరకు ఒక బ్యూటిఫుల్ పోస్టర్ కూడా విడుదల చేసారు.
ఇక ఇప్పటికే టాలీవుడ్ లో దసరా సందడి మొదలయ్యింది.ఇప్పటికే పలు క్రేజీ సినిమాలు దసరా బరిలోకి దిగబోతున్నట్టు అనౌన్స్ చేసాయి.అఖిల్ బ్యాచిలర్ సినిమా, శర్వానంద్ మహా సముద్రం ఇప్పటికే విడుదల తేదీ ప్రకటించాయి.
ఇక ఇప్పుడు నాగ శౌర్య కూడా బరిలోకి రాబోతున్నట్టు ప్రకటించడంతో టాలీవుడ్ థియేటర్స్ కళకళ లాడబోతున్నాయి.చాలా రోజుల తర్వాత సినిమాలు విడుదల అయ్యేందుకు మొగ్గు చూపుతున్నాయి.
మరి దసరా విన్నర్ గా ఎవరు నిలుస్తారో వేచిచూడాలి.