టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగ శౌర్య నిన్న గ్రాండ్ గా పెళ్లి చేసుకున్న విషయం విదితమే.నిన్న ఉదయం నుండి ఈయన పెళ్ళికి సంబందించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి.
నాగ శౌర్య పెళ్ళిలో చేసిన ఎంజాయ్ మెంట్ చూసి ఆయన ఫ్యాన్స్ వీటిని వైరల్ చేసేస్తున్నారు.
బంధు మిత్రుల మధ్య ఆనందంగా నాగ శౌర్య తన సతీమణి మెడలో తాళి కట్టి, తలంబ్రాలు పోసి ఆ ఘట్టాన్ని విజయ వంతంగా పూర్తి చేసాడు.
నాగ శౌర్య బెంగుళూరు కు చెందిన అనూష శెట్టిని నిన్న ఉదయం పెళ్లి చేసుకున్నాడు.అనూష ఇంటీరియర్ డిజైనర్ గా పని చేస్తుంది.నాగ శౌర్య-అనూష పెళ్లిని పెద్దలు కుదిర్చారు.బెంగుళూరు లోని స్టార్ హోటల్ లో ఈ పెళ్లి బంధు మిత్రుల మధ్య కోలాహలంగా అల్లరి మధ్య జరిగింది.
రెండు రోజుల నుండే వీరి వివాహ వేడుక ముందు జరిగే వేడుకల నుండి రకరకాల ఫోటోలు బయటకు వచ్చి వైరల్ అయ్యాయి.ఇక నిన్నటి నుండి పెళ్లి ఫోటోలు సోషల్ మాధ్యమాల్లో అలరిస్తున్నాయి.
ఇదిలా ఉండగా స్వయంగా నాగ శౌర్య తన భార్యను పరిచయం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసారు.
నాగ శౌర్య పెళ్లి జరగడంతో ఇప్పుడు మరో కొత్త జీవితం స్టార్ట్ అయ్యింది.దీంతో నాగ శౌర్య సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటో షేర్ చేసాడు.ఈ ఫోటోలో నాగ శౌర్య అనూష శెట్టి మెడలో తాళికట్టే ఫోటోను షేర్ చేస్తూ.”నా లైఫ్ టైమ్ రెస్పాన్సిబిలిటీని పరిచయం చేస్తున్నాను” అంటూ క్యాప్షన్ ఇచ్చారు.దీంతో ఈ పోస్ట్ వైరల్ అయ్యింది.
ఇక నాగ శౌర్య ప్రెజెంట్ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి అనే సినిమాలో చేస్తున్నాడు.ఇటీవలే ఈయన నటించిన కృష్ణ వ్రింద విహారి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్నాడు.