అక్కినేని హీరో నాగ చైతన్య ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో థాంక్యూ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇది కాకుండా హిందీలో అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న లాల్ సింగ్ చద్దా మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఇదిలా ఉంటే ఇప్పుడు మరో దర్శకుడుకి చైతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.ఫీల్ గుడ్ మూవీస్ తో హ్యాట్రిక్ హిట్స్ సొంతం చేసుకున్న కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ మూవీ చేయడానికి చైతన్య ఒకే చెప్పాడానికి తెలుస్తుంది.
ఇక ఈ మూవీ కిషోర్ ఫ్లేవర్ లోనే లవ్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఉండబోతుందని తెలుస్తుంది.ఇప్పటికే చైతన్యకి కథ కూడా చెప్పి ఒకే చేయించుకున్నట్లు టాక్ వినిపిస్తుంది.
ఇదిలా ఉంటే ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా నిర్మాతగా మారిన డీవీవీ దానయ్య ఈ సినిమాని నిర్మించనున్నట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం కిషోర్ తిరుమల శర్వానంద్ హీరోగా ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.స్టార్ హీరోయిన్ రష్మిక మందన ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వత చైతన్యతో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళే అవకాశం ఉంది.దీనిని బట్టి వచ్చే ఏడాదిలోనే వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ స్టార్ట్ అవుతుందనే మాట వినిపిస్తుంది.
వరుసగా హ్యాట్రిక్ విజయాలతో జోరు మీద ఉన్న చైతన్య ప్రస్తుతం హిందీలోకి కూడా ఎంట్రీ ఇస్తున్న నేపధ్యంలో తన క్రేజ్ ని మరింత పెంచుకుంటున్నాడు.ఈ నేపధ్యంలో కిషోర్ తో మూవీని మల్టీ లింగ్వల్ గా ప్లాన్ చేసే అవకాశం ఉందనే మాట కూడా ఫిలిం నగర్ సర్కిల్ లో వినిపిస్తుంది.