ఇప్పుడు డిజిటల్ ట్రెండ్ మంచి ఊపులోకి వచ్చింది.ఇక భవిష్యత్తు అంతా ఈ డిజిటల్ ట్రెండ్ నడుస్తుందని ఇప్పటికే సినిమా వర్గాలు భావిస్తున్నాయి.
థియేటర్స్ సంఖ్య క్రమంగా తగ్గిపోయి సినిమాలు కూడా డిజిటల్ ప్లాట్ ఫాం ద్వారానే ప్రతి ఇంట్లో చూసుకునే విధంగా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి.దీనికి ఇప్పటికి రంగం కూడా సిద్ధం అయ్యింది.
పెద్ద సినిమాలు రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే డిజిటల్ ఫ్లాట్ ఫాంలో ప్రత్యక్షం అవుతున్నాయి.ఇక ఈ డిజిటల్ మీడియా ద్వారా నిర్మాతలకి కూడా కాసులు పంట పడుతుంది.
ఈ నేపధ్యంలో మన దర్శకులు, నిర్మాతలు కూడా వెబ్ సిరీస్ ల మీద దృష్టి పెడుతున్నారు.ప్రస్తుతం శ్రీకాంత్ హీరోగా జీ5లో చదరంగం అనే పొలిటికల్ నేపధ్యంలో వెబ్ సిరీస్ వస్తున్నా సంగతి తెలిసిందే.
సమంత కూడా ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ లో నటిస్తోంది.త్వరలోనే ఈ సిరీస్ ఎయిర్ కానుంది.ఇప్పుడు నాగచైతన్య వెబ్ సిరీస్ లో నటించేందుకు ఆసక్తిగా ఉన్నాడన్న వార్త సంచలనంగా మారింది.ఇటీవలే మనం ఫేం విక్రమ్.
కె.కుమార్ ఓ వెబ్ సిరీస్ స్క్రిప్టును చైతూకి వినిపించాడట.ఐడియా బావుంది చేసేద్దాం అంటూ చైతూ కమిటయ్యాడని ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ ఆ పనిలోనే ఉన్నాడని ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట.10 ఎపిసోడ్లతో క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో వెబ్ సిరీస్ ని నిర్మించేందుకు ప్రైమ్ వీడియోతో ఇప్పటికే ఒప్పందం కుదిరిందని తెలుస్తుంది.చైతూ నిజంగానే ఈ వెబ్ సిరీస్ చేస్తే డిజిటల్ మీడియాలోకి ఎంటర్ అయిన సౌత్ లో తొలి స్టార్ హీరోగా నాగ చైతన్య పేరు నిలిచిపోతుంది.ఇక ఇదే బాటలో కళ్యాణ్ రామ్, రానా వంటి హీరోలు కూడా వెబ్ సిరీస్ లలో సత్తా చాటడానికి సిద్ధంఅ అవుతున్నారు.
మరి వీరిలో ముందు వరుసలో ఎవరుంటారు అనేది వేచి చూడాలి.