అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య ఇటీవల చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.చైతూ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘లవ్స్టోరి’ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్కు రెడీ అయ్యింది.
ఈ సినిమాను ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.అయితే వేసవి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని చూసినా, కరోనా కారణంగా అది వాయిదా పడింది.
దీంతో ఈ సినిమాను వచ్చే ఏడాది మొదట్లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.కాగా చైతూ 2021లో ఏకంగా మూడు సినిమాలు రిలీజ్ చేసి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు.
ఈ క్రమంలోనే మనం లాంటి సూపర్ హిట్ మూవీని అందించిన దర్శకుడు విక్రమ్ కుమార్తో మరో సినిమా చేసేందుకు చైతూ రెడీ అవుతున్నాడు.ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేయాలని ఆయన ప్లాన్ చేస్తున్నాడు.
ఇక దర్శకులు నందిని రెడ్డి లేదా మోహన్ కృష్ణ ఇంద్రగంటితో చైతూ మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.ఈ సినిమాను వచ్చే ఏడాది చివరినాటికి రిలీజ్ చేయాలని చైతూ భావిస్తున్నాడు.
మరి చైతూ ప్లాన్ చేస్తున్న ఈ సినిమాలు అనుకున్న సమయానికి రిలీజ్ అవుతాయా లేక వాయిదా పడతాయా అనేది చూడాలి.ఏదేమైనా చైతూ ఇలా వరుసగా సినిమాలను లైన్లో పెడుతుండటంతో అక్కినేని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.