గత సంవత్సర కాలం నుంచి కరోనా ప్రభావం చాలా రంగాలపై ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ కొట్టిందని చెప్పవచ్చు.ఈ క్రమంలోనే కరోనా ప్రభావం సినిమా రంగంపై తీవ్ర ప్రభావం చూపింది.
థియేటర్లు మూత పడటంతో చిన్న సెలబ్రిటీల నుంచి స్టార్ సెలబ్రిటీల చూపు ఓటీటీ వైపు పడిందని చెప్పవచ్చు.ఇప్పటికే సమంత, తమన్నా, వంటి స్టార్ సెలబ్రిటీలు ఓటీటీలో తమదైన గుర్తింపును సంపాదించుకున్నారు.
తాజాగా ఓటీటీ వైపు మరొక హీరో అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలో తనదైన గుర్తింపు సంపాదించుకున్న నాగచైతన్య దృష్టి కూడా ఓటీటీ వైపు పడినట్లు తెలుస్తోంది.
తెలుగు నిర్మాత శరత్ మరార్ రూపొందించిన ఓ కథతో చైతూ డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది.
ప్రస్తుతం నాగ చైతన్య ‘లాల్సింగ్ చద్దా’ లో చేస్తున్నారు.దీని తర్వాత నాగచైతన్య హీరోగా ‘బంగార్రాజు’ ప్రారంభం కానుంది.ఇవన్నీ పూర్తి చేసుకున్న తర్వాతనే చైతన్య ఓటీటీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళుతుందనే సమాచారం వినబడుతుంది.
ఇకపోతే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన “లవ్ స్టోరీ” సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.