టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ నాగచైతన్య, సమంత విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి అందరికీ విదితమే.అయితే, వీరు విడిపోబోతున్నారని గత రెండు నెలలుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతునే ఉన్నాయి.
ఈ క్రమంలోనే నాగచైతన్య నెల రోజుల నుంచి ఇంట్లో లేడని, ఓ హోటల్ రూంలోనే ఉంటున్నాడని వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
తమకు విడాకులు కావాలని నాగచైతన్య, సమంత కోర్టుకు వెళ్లగా వారికి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు, అయినా వారు వినలేదని దాంతోనే విడాకులు ఇవ్వడానికి కోర్టు ఓకే అందని సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఓ వార్త ద్వారా తెలుస్తోంది.
అయితే, నాగచైతన్య కాని సమంత కాని ఇంత కాలం పాటు ఈ విషయమై స్పందించలేదు.కాగా, నాగచైతన్య నటించిన ‘లవ్ స్టోరి’ ఫిల్మ్ ప్రమోషనల్ ఇంటర్వ్యూస్, ఇతర యాక్టివిటీస్లో చైతన్య యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు.
అయితే, చైతన్య ఇందుకుగాను హోటల్ రూమ్ నుంచి బయటకు వస్తున్నాడని, సమంతతో లేడని ఓ న్యూస్ నెట్టింట బాగా వైరలవుతోంది.అయితే, సమంత మాత్రం నాగచైతన్య ‘లవ్ స్టోరి’ సక్సెస్పైన ఎటువంటి కామెంట్స్ చేయకుండా తన ఫ్రెండ్స్తో హ్యాపీగా ఎంజాయ్ చేసింది.
కీర్తి సురేశ్, త్రిష, ప్రియతో కలిసి హ్యాపీగా పార్టీ చేసుకుంది సామ్.ఇందుకు సంబంధించిన పోస్టును ఇన్ స్టా వేదికగా షేర్ చేసింది సామ్.ఇకపోతే ‘సాకీ’ బ్రాండ్ స్టార్ట్ అయిన వన్ ఇయర్ అయిన సందర్భంగా వన్ ఇయర్ ప్రమోషన్స్లోనూ సామ్ యాక్టివ్గానే సెలబ్రేట్ చేసుకుంది.
ఈ క్రమంలోనే ఇన్ స్టా గ్రామ్ వేదికగా అభిమానులతో ముచ్చటించింది.అయితే, అప్పుడు కూడా నాగచైతన్యతో విడాకులపై స్పష్టంగా స్పందించలేదు సామ్.ఫైనల్గా వివాహ బంధానికి ముగింపు పలికేశారు నాగచైతన్య, సమంత.
ఇక వీరి ప్రొఫెషనల్ కెరీర్ సినిమాల విషయానికొస్తే.నాగచైతన్య మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’తో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
ఈ ఫిల్మ్లో బాలరాజు అనే కీలక పాత్రను చైతన్య పోషించాడు.తండ్రి నాగార్జునతో ‘బంగార్రాజు’ అనే చిత్రంలోనూ నాగచైతన్య నటిస్తున్నాడు.
ఇక సమంత ప్రస్తుతం పాన్ ఇండియా ఫిల్మ్ ‘శాకుంతలం’ లో లీడ్ రోల్ ప్లే చేస్తోంది.ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు.
.