నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా రూపొందుతున్న ‘లవ్ స్టోరీ’ సినిమాను గత ఏడాది చివర్లోనే విడుదల చేయాలనుకుంటే కొన్ని కారణాల వల్ల విడుదల కాలేదు.సమ్మర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేశారు.
అయితే కరోనా కారణంగా షూటింగ్ పూర్తి కాలేదు.దాంతో మళ్లీ వాయిదా పడింది.
థియేటర్లు ఓపెన్ అయ్యే టైం వరకు సినిమాను పూర్తి చేయాలని భావించారు.కాని కరోనా కారణంగా ఇన్ని రోజులు షూటింగ్ కు వెళ్లలేదు.
ఎట్టకేలకు నిన్నటి నుండి షూటింగ్ జరుగుతోంది.అతి తక్కువ మంది టెక్నీషియన్స్ మరియు నటీనటులతో సినిమా షూటింగ్ను జరుపుతున్నారు.
రెండు వారాల పాటు షూటింగ్ ను జరిపి సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేయలని నిర్ణయించారు.పూర్తి జాగ్రత్తలు పాటిస్తూ సినిమాను పూర్తి చేయాలని శేఖర్ కమ్ముల భావించాడు.
అనుకున్నదే తడువుగా షూటింగ్ మొదలు పెట్టాడు.అయితే ఇన్ని రోజులు షూటింగ్ కు వెళ్లని శేఖర్ కమ్ముల ఇప్పుడు హఠాత్తుగా హడావుడిగా షూటింగ్ను మొదలు పెట్టడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటీ అంటూ సినీ జనాలు మరియు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
చాలా మంది ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయడం కోసం శేఖర్ కమ్ముల షూటింగ్ను మమా అనిపించబోతున్నాడా అంటున్నారు.ఇదే సమయంలో కొందరు ఈ సినిమా పూర్తి అయితే మరో సినిమాపై దృష్టి పెట్టవచ్చు అనే ఉద్దేశ్యంతో పూర్తి చేయాలని భావిస్తున్నారు అంటున్నారు.
లవ్ స్టోరీ తర్వాత నాగచైతన్య ‘థ్యాంక్యూ’ చేయబోతున్నాడు.అందుకు సంబంధించిన ప్రకటన ఇప్పటికే అధికారికంగా వచ్చింది.సినిమాకు సంబంధించి షూటింగ్ కార్యక్రమాలు వచ్చే నెల నుండి మొదలు అయ్యే అవకాశం ఉంది.సినిమాను దిల్ రాజు నిర్మించబోతున్నాడు.
నాగచైతన్య హీరోగా దిల్ రాజు నిర్మాణంలో చాలా కాలంగా రాబోతుంది.ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయంలో చర్చ జరుగుతోంది.
సమంత ను నటింపజేస్తే బాగుంటుందని కొందరు బలంగా కోరుకుంటున్నారు.కాని అందుకు సమంత ఒప్పుకుంటుందా అనేది చూడాలి.