ప్రెసెంట్ అక్కినేని నాగ చైతన్య సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది.
లవ్ స్టోరీ సినిమాను సెప్టెంబర్ 24 న విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.అందుకే రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ఈ సినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్.
ఈ మధ్యనే ఈ సినిమా నుండి ట్రైలర్ విడుదల చేయగా భారీ రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈ సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.ఇక ప్రమోషన్స్ లో భాగంగా నాగ చైతన్య మీడియా వచ్చారు.ఈ ఇంటర్వ్యూ లలో నాగ చైతన్య వ్యక్తిగత ప్రశ్నలు మాట్లాడ వద్దని చెబుతున్నాడు.
ఎందుకంటే ఈ మధ్య సమంత చైతూ కు మధ్య మనస్పర్థలు వచ్చాయని వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి.
ముందు సమంత సోషల్ మీడియాలో అక్కినేని అనే నేమ్ ను తొలగించి S అనే అక్షరం పెట్టడంతో అసలు గుసగుసలు స్టార్ట్ అయ్యాయి.ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు వీరిద్దరిపై ఎన్నో వార్తలు వస్తున్నా ఎవ్వరు స్పందించడం లేదు.అయితే లవ్ స్టోరీ ప్రమోషన్స్ లో నాగ చైతన్య వస్తే ఈ విషయంపై అడగాలని మీడియా ఎదురు చూస్తుంది.
అయితే ఇంటర్వ్యూలో చైతు ముందుగానే వ్యక్తిగత ప్రశ్నలు వద్దంటూ చెబుతున్నాడు.
వాళ్ళ వ్యక్తిగత విషయంలో చైతు స్పందించడానికి ఆసక్తిగా లేడని తెలుస్తుంది.ఇప్పటి వరకు చైతు ఈ పుకార్లపై స్పందించి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెడతాడని ఎదురు చుసిన అక్కినేని అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురయ్యింది.ఇక వీరిద్దరూ స్పందించకుంటే ఈ పుకార్ల సంగతి ఏంటని అభిమానులు మాట్లాడు కుంటున్నారు.
ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది.