అక్కినేని నాగ చైతన్య, సమంతలు ఇద్దరు డైవర్స్ తీసుకుంటున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.కొన్నాళ్లుగా చైతు, సమంతలు విడిపోతున్నట్టుగా వార్తలు వస్తున్నా అఫీషియల్ కన్ఫర్మేషన్ గురించి వెయిట్ చేశారు.
ఇక లేటెస్ట్ గా సమంత, చైతు ఇద్దరు తమ ఇన్ స్టాగ్రాం లో డైవర్స్ గురించి చెప్పారు.ఇక సమంత ఇలా డైవర్స్ గురించ్ని చెప్పిందో లేదో అలా కోలీవుడ్ హీరో సిద్ధార్థ్ ఒక ట్వీట్ చేశాడు.
చిన్నప్పుడు తన టీచర్ నుండి ఫస్ట్ లెసన్ నేర్చుకున్నానని.అదేంటి అంటే మోసం చేసిన వాళ్లు ఎప్పటికి అభివృద్ధి చెందరు అని సిద్ధార్థ్ ట్వీట్ చేశాడు.
సిద్ధార్థ్ చేసిన ఈ ట్వీట్ సమంత గురించే అని అందరు చెప్పుకుంటున్నారు.నాగ చైతన్యకు ముందు సిద్ధార్థ్ తో సమంత చెట్టాపట్టాలేసుకుని తిరిగింది.
ఒకానొక దశలో సమంత సిద్ధార్థ్ పెళ్లి చేసుకుంటారన్న టాక్ కూడా వచ్చింది.కాని చైతుతో ప్రేమలో పడి అతన్ని పెళ్లాడింది.
నాలుగేళ్లు కలిసి ఉన్న చైతు, సమంత ఇద్దరు బాగా ఆలోచించుకుని ఎవరి దారి వారు చూసుకోవాలని అనుకుంటున్నారు.కెరియర్ లో మంచి ఫాంలో ఉన్న నాగ చైతన్యకు ఇదో పెద్ద షాక్ అని చెప్పొచ్చు.