కరోనా సమయంలో మూతబడిన థియేటర్లు తెరుచుకున్న తర్వాత సినిమా థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను సందడి చేసిన సినిమాలలో లవ్ స్టోరీ ఒకటి.ఈ సినిమా థియేటర్లలో విడుదలై అద్భుతమైన విజయాన్ని అందుకొని ఎన్నో సినిమాలకు ధైర్యాన్ని నూరిపోసింది.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన ఈ ప్రేమ కథ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
థియేటర్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకున్న లవ్ స్టోరీ త్వరలోనే డిజిటల్ ప్లాట్ ఫామ్ పై సందడి చేయనుంది.
థియేటర్ల వద్ద ప్రేక్షకులను ఎంతగానో సందడి చేస్తున్న ఈ సినిమా ఆహా యాప్ లో స్ట్రీమింగ్ కానుంది.ఈ క్రమంలోనే ఈ సినిమా ఈనెల 22వ తేదీ నుంచి ఆహాలో ప్రసారం కానుందనే వార్త వినపడుతోంది.
అయితే ఈ విషయం గురించి ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి అధికారిక ప్రకటన తెలియజేయలేదు.
లవ్ స్టోరీ సినిమాలో నాగచైతన్య సాయి పల్లవి ప్రేమ కథ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.గ్రామీణ ప్రాంతాలలో ఉన్న కుల వివక్షతను, అమ్మాయిల పట్ల ప్రస్తుతం జరుగుతున్న సంఘటనల ఆధారంగా శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.థియేటర్ దగ్గర ప్రేక్షకులను సందడి చేసిన ఈ చిత్రం త్వరలోనే ఆహా ద్వారా మరికొంత మంది ప్రేక్షకులను సందడి చేయనుంది.