లవ్‌ స్టోరీ ముగిసింది.. అయినా ఇప్పుడు రాదు

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న లవ్ స్టోరీ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది.కరోనా లాక్‌ డౌన్‌ కు ముందే షూటింగ్‌ చివరి దశకు చేరుకున్నట్లుగా యూనిట్‌ సభ్యులు ప్రకటించారు.

 Naga Chaitanya Sai Pallavi Movie Love Story Shooting Completed-TeluguStop.com

ఏప్రిల్‌ లో సినిమా విడుదల అవుతుంది అనుకుంటూ ఉండగా మహమ్మారి కరోనా వల్ల మొత్తం ఆగిపోయింది.ఆరు నెలల గ్యాప్‌ తర్వాత కరోనా జాగ్రత్తలు తీసుకుని ఇటీవల రెండు వారాల పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేశారు.

రెండు మూడు రోజులు ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్‌ మొత్తం పూర్తి అయ్యిందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.శేఖర్ కమ్ముల ఫిదా సినిమా తర్వాత రూపొందిస్తున్న సినిమా ఇది అవ్వడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.

నాగ చైతన్యకు మరియు సాయి పల్లవికి ఈ సినిమా సూపర్ హిట్ ని అందిస్తుందని నమ్మకంతో అంతా ఉన్నారు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.

సినిమా అంతా పూర్తి అయ్యి విడుదలకు సిద్దం అయినా కూడా ఇప్పటి వరకు సినిమా అప్డేట్ ను యూనిట్‌ సభ్యులు ఆసక్తి చూపించడం లేదు.ఎందుకంటే సినిమా విడుదలకు ఇది సరైన సమయం కాదని కరోనా పూర్తిగా కనుమరుగయిన తర్వాత విడుదల చేయాలని అనుకుంటున్నారట.

ఎప్పుడైతే సినిమా థియేటర్లు 100% ఆక్యుపెన్సీ తో నడుస్తాయో అప్పుడు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశంతో దర్శకుడు శేఖర్ కమ్ముల ఉన్నాడు.అంటే వచ్చే ఏడాది ఏప్రిల్‌ లేదా మే వరకు లవ్ స్టోరీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం లేదు.

ఆ కారణంగానే సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ని కూడా ఇవ్వడం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube