హీరో నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో క్రేజీ హీరోయిన్ సాయి పల్లవితో చైతూ రొమాన్స్ చేస్తున్నాడు.
ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా శేఖర్ కమ్ముల ఈ సినిమాని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడు.ఫిదాతో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ కొట్టిన శేఖర్ కమ్ముల తనకి అలవాటైన ఎమోషనల్ లవ్ డ్రామానే ఈ సినిమాలో కూడా తెరపై ఆవిష్కరిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ చివరి దశకి చేరుకుంది.ఈ నెల ఆఖరుకి షూటింగ్ కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇక దీంతో మరో హిట్ ని ఖాతాలో వేసుకోవాలని దర్శకుడు శేఖర్ కమ్ముల గట్టి ప్రయత్నం చేస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం ఓటీటీ సంస్థలు గట్టిగా ప్రయత్నం చేస్తున్నాయి.
సాయి పల్లవి, శేఖర్ కమ్ములకి ఉన్న క్రేజ్ నేపధ్యంలో ఎక్కువ మొత్తంలో డబ్బులు ఆఫర్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో పెద్ద పెద్ద సినిమాలు ఓటీటీ బాట పడుతూ ఉండటంతో లవ్ స్టోరీ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేస్తారంటూ రూమర్స్ వచ్చాయి.
ప్రముఖ ఓటీటీ లవ్ స్టోరీ సినిమాకి 35 కోట్ల వరకు చెల్లించడానికి ముందుకు వచ్చిందని టాక్ గట్టిగా వినిపించింది.అయితే ఈ విషయంపై నిర్మాతలు హీరో నాగచైతన్య ని సంప్రదించగా ఓటీటీ రిలీజ్ అసలు వద్దని చెప్పినట్లు ఫిలిం నగర్ సర్కిల్స్ లో వినిపిస్తుంది.
ఎంత ఆఫర్ చేసినా ఎంత లేట్ అయినా లవ్ స్టోరీని థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలని చైతన్య నిర్మాతలకి చెప్పారని సమాచారం.దీంతో నిర్మాతలు కూడా వెనక్కి తగ్గి ఈ సినిమాని సంక్రాంతి బరిలో నిలిపేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తుంది.
అయితే ఇది ఎంత వరకు సాధ్యం అవుతుంది అనేది తెలియాలంటే థియేటర్లు తిరిగి ప్రారంభించడానికి కేంద్రం పర్మిషన్ ఇచ్చే వరకు వేచి చూడాలి.