అక్కినేని కుటుంబం నుండి వచ్చినా నాగ చైతన్య తనకంటూ ప్రత్యేక మైన గుర్తింపును సంపాదించుకున్నాడు.మజిలీ సినిమా హిట్ అయిన తర్వాత నాగ చైతన్య విభిన్న కథలను ఎంచుకుంటూ జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నాడు.
చైతూ ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ సినిమా పూర్తి చేసి విడుదలకు సిద్ధంగా ఉంచాడు.ఈ సినిమాలో నాచ్యురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమా ఏప్రిల్ 16 న విడుదల అవ్వాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది.ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి.
ఇప్పటికే వచ్చిన సాంగ్స్, టీజర్ అన్ని కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.ఈ సినిమానా విడుదల అవ్వకుండానే నాగ చైతన్య మరొక సినిమాను లైన్లో పెట్టాడు.
విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో థాంక్యూసినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో నాగ చైతన్యకు జోడీగా రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది.మాళవిక నాయర్, అవికా గోర్ కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
విక్రమ్ ఈ సినిమాను రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు.ఈ మధ్యనే ఇటలీ లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగి వచ్చింది.
తర్వాత షెడ్యూల్ హైదరాబాద్ లో జరగనుంది.
ఈ సినిమాతో పాటు నాగ చైతన్య బాలీవుడ్ మూవీ లాల్ సింగ్ చద్దాలో నటిస్తున్నాడు.ఈ సినిమాలో అమీర్ ఖాన్ హీరోగా నటిస్తుంటే.చైతన్య ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
నాగ చైతన్య ఈ సినిమాలో 18 నిముషాల పాటు కనిపించ బోతున్నాడని టాక్.ఈ సినిమాలో చైతూ ఒక తెలుగు కుర్రాడిగా నటిస్తున్నాడట.
ఇది పూర్తి కాగానే అమెజాన్ ప్రైమ్ కోసం ఒక వెబ్ సిరీస్ లో నటించబోతున్నాడు.
ఇవ్వన్నీ ఉండగానే మళ్ళీ మరొక డైరెక్టర్ ను లైన్లో పెట్టినట్టు టాక్ వినిపిస్తుంది.
ఈ సినిమాలు పూర్తి కాకుండానే నాగ చైతన్య వెంకీ కుడుముల తో మరొక సినిమాకు కమిట్ అయినట్టు వార్తలు వస్తున్నాయి.ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.
మొత్తానికి చాలా జాగ్రత్తగా తన కెరీర్ ను ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నాడు చైతన్య.