సూపర్ స్టార్ మహేష్ ఏ.ఎం.
బి మాల్ నుండి లవ్ స్టోరీ టీం కు శుభాకాంక్షలు అందాయి.సెకండ్ వేవ్ తర్వాత డైరెక్ట్ గా థియేట్రికల్ రిలీజ్ చేసిన క్రేజీ మూవీ లవ్ స్టోరీ.
సినిమాపై అంచనాలు ఉన్నా ప్రేక్షకులు వస్తారా లేరా.వసూళ్ల పరిస్థితి ఏంటి అన్నది అర్ధం కాలేదు.
కాని లవ్ స్టోరీ సినిమా హ్యూజ్ హిట్ అవడమే కాకుండా మహేష్ ఏ.ఎం.బి మాల్ లో రికార్డ్ సృష్టించింది.అంతకుముందు ఎలా ఉన్నా కరోనా టైం లో లవ్ స్టోరీ సినిమా ఏ.ఎం.బి మాల్ లో కోటి రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసిందని తెలుస్తుంది.
అదే విషయాన్ని ఎనౌన్స్ చేస్తూ లవ్ స్టోరీ సినిమాకు మొత్తం 251 షోలు వేశాము.అందులో 48233 మంది ప్రేక్షకులు ఈ సినిమా చూశారు.దీంతో మా థియేటర్ కు కోటి రూపాయల గ్రాస్ వచ్చింది.చిత్రయూనిట్ కు ఏ.
ఎం.బి మాల్ తరపున శుభాకాంక్షలు అంటూ షేర్ చేశారు.ఏ.ఎం.బి మాల్ లో కోటి గ్రాస్ అంటే కచ్చితంగా లవ్ స్టోరీ సూపర్ రికార్డ్ సృష్టించిందని చెప్పొచ్చు.నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమాను శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేశారు.
.