అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్లో లవ్స్టోరీ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో చైతూతో రొమాన్స్ చేస్తోంది అందాల భామ సాయి పల్లవి.
గతంలో ఫిదా చిత్రంలో నటించిన సాయి పల్లవిని మరోసారి తన చిత్రంలో తీసుకుని సేమ్ రిజల్ట్ను అందుకోవాలని చూస్తున్నాడు శేఖర్ కమ్ముల.
కాగా ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ విషయంలో చిత్ర యూనిట్ డైలమాలో పడిందట.ఈ సినిమాను రూ.40 కోట్లకు అమ్మాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.అయితే చైతూ సినిమాకు అంతలేదని, ఆయన సినిమాకు ఇది భారీ రేటు అని డిస్ట్రిబ్యూటర్లు అంటున్నారు.కాగా చైతూ నటించిన గత రెండు సినిమాల కలెక్షన్లు దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా రేటును డిసైడ్ చేశారట చిత్ర యూనిట్.
అయితే గతంలో చైతూ నటించిన మజిలీ సినిమాకు సమంత కలిసొచ్చిందని, కేవలం ఆమె క్రేజ్ వల్లనే ఆ సినిమా గట్టెక్కిందని పలువురు కామెంట్ చేశారట.
అటు వెంకటేష్తో చైతూ కలిసి నటించిన వెంకీమామ చిత్రంలోనూ వెంకటేష్కే క్రెడిట్ ఇచ్చాయి చిత్ర వర్గాలు.
వెంకటేష్ క్రేజ్కే ఆ సినిమా అంత మార్కెట్ సాధించిందని వారు అంటున్నారు.దీంతో ఒక్క నాగచైతన్య మీద ఇంత పెట్టుబడి పెట్టడం పెద్ద రిస్కే అంటున్నారు డిస్ట్రిబ్యూటర్లు.
ఏదేమైనా ఈ సినిమా రేటును ఎంతమేర నిర్ణయించాలా అనే డైలమాలో పడిందట చిత్ర యూనిట్.ఇక పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఆగస్టు 22న రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.