నాగ చైతన్య ఈ మధ్య చేస్తున్న సినిమాలన్నీ ఆచి తూచి చేస్తున్నాడు.మజిలీ సినిమా హిట్ తర్వాత చైతూ చేస్తున్న సినిమా లవ్ స్టోరీ.
ఈ సినిమాను లవ్ స్టోరీస్ తెరకెక్కించడంలో ఆరితేరిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతుంది.ఇందులో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటించడంతో మరింత అంచనాలు పెరిగాయి.
ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన పోస్టర్స్, టీజర్, పాటలు ఈ సినిమాపై మంచి అంచనాలు పెంచేసాయి.
ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకుని సమ్మర్ కానుకగా విడుదల అవ్వాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది.అప్పటి నుండి ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ మళ్ళీ ప్రకటించలేదు.అయితే ఈ మధ్యనే కరోనా నుండి కోలుకుని థియేటర్స్ ఓపెన్ అవ్వడంతో ఈ సినిమాను సెప్టెంబర్ 10న వినాయక చవితి కానుకగా విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
కానీ మళ్ళీ ఏమైందో తెలియదు కానీ వాయిదా వేసినట్టు తెలుస్తుంది.వినాయక చవితికి ఈ సినిమా రావడం లేదని తెలపడంతో ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమా విడుదల అవుతుందని ఎంతో ఆనందించే లోపే ఆ సినిమా మళ్ళీ వాయిదా అని చెప్పడంతో అభిమానుల ఉత్సాహం అంత నీరుగారి పోయింది.అయితే ఈ సినిమాను మరొక కొత్త డేట్ కు షిఫ్ట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమాను సెప్టెంబర్ నెల చివర్లో విడుదల చేయబోతున్నట్టు సమాచారం.తాజాగా వస్తున్న సమాచారం మేరకు ఈ సినిమాను సెప్టెంబర్ 24 న కానీ లేదంటే 30 న కానీ రిలీజ్ చెయ్యాలని మేకర్స్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది.మరి దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన రాబోతుందని కూడా టాక్.ఇక మోస్ట్ అవైటెడ్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుందో ప్రకటన వస్తే కానీ తెలియదు.