ఇప్పుడు మన టాలీవుడ్ లో ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమాల్లో లవ్ స్టోరీ సినిమా ముందు వరుసలో ఉంది.రేపు విడుదల కాబోతున్న లవ్ స్టోరీ సినిమాపై అటు అభిమానులతో పాటు ఇటు సినీ ప్రముఖులు కూడా ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమా ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తుంది.ఎట్టకేలకు ఈ సినిమా రేపు వరల్డ్ వైజ్ రిలీజ్ కాబోతుంది.
ఈ సినిమాలో యంగ్ హీరో నాగ చైతన్య, ఫిదా బ్యూటీ సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు.వీరి కెమిస్ట్రీ తెరమీద ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమాను శేఖర్ కమ్ముల తెరకెక్కించడంలో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచాయి.అయితే ఈ సినిమా విడుదల అవవకుండానే సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
ఓవర్సీస్ లో మన టాలీవుడ్ సినిమాలకు మంచి వసూళ్లు వస్తాయి.ముఖ్యంగా యుఎస్, యూకే లో మంచి ఆదాయం వస్తుంది.
ఇప్పుడు లవ్ స్టోరీ సినిమా అక్కడ విడుదల కాబోతుంది.కరోనా కారణంగా ఇప్పటి వరకు యుకె లో ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు.
రెండు సంవత్సరాల తర్వాత రిలీజ్ అవుతున్న తోలి తెలుగు సినిమా లవ్ స్టోరీ సినిమా కావడం విశేషం.
కరోనా ప్రభావం వల్ల మిలియన్ డాలర్లు వసూలు చేసే మన తెలుగు సినిమాలు ఇప్పుడు ఆ వసూళ్లకు కరోనా గండికొట్టింది.కరోనా తర్వాత జాతి రత్నాలు సినిమా మాత్రమే కొంచెం వసూళ్లు సాధించింది.ఇప్పుడు లవ్ స్టోరీ సినిమా రిలీజ్ కు ముందే ప్రీ సేల్స్ పొందడం అందరికి ఆనందం కలిగించే విషయం.
లవ్ స్టోరీ ప్రీ సేల్స్ ఇప్పటి వరకు $150K వాసులు చేసింది.
పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాకు కూడా కేవలం $120K+ ప్రీ సేల్ బిజినెస్ మాత్రమే జరిగింది.కానీ ఈ రికార్డ్ ను లవ్ స్టోరీ సినిమా బ్రేక్ చేసింది.$150K+ ప్రీ సేల్స్ సాధించి కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.రేపటి వరకు ఆగితే ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో తెలిసిపోతుంది.