యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య తాజాగా నటిస్తున్న చిత్రం లవ్ స్టోరీ.ఈ చిత్రంలో నాగచైతన్య సరసన ఫిదా హీరోయిన్ సాయి పల్లవి నటిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా దాదాపు షూటింగ్ ను పూర్తిచేసుకుందన్న ప్రచారం సాగుతోంది.అయితే ఈ సినిమాలో నటిస్తున్న హీరో నాగచైతన్య సినిమాలు ఇప్పటివరకు మీడియం రేంజ్ బడ్జెట్లతో మాత్రమే తెరకెక్కాయి.నాగచైతన్య తన కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి కూడా తన సినిమాలకు ఎక్కువ బడ్జెట్ పెట్టలేదని సినీ వర్గాల సమాచారం.
2019 సంవత్సరంలో నాగచైతన్య నటించిన మజిలీ సినిమా ది బెస్ట్ సినిమా అనిపించుకోగా, బడ్జెట్ పరంగా మాత్రం కేవలం 20 కోట్ల రూపాయలతో మాత్రమే నిర్మించారు.అయితే ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమా తెరకెక్కుతుంది.అయితే ఈ సినిమాకు బడ్జెట్ భారీగానే పెట్టినట్లు సమాచారం.శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా నిర్మించడానికి దాదాపు 35 కోట్ల వరకు బడ్జెట్ ను పెట్టినట్లు టాలీవుడ్ సమాచారం.
ఇప్పటికే ఈ చిత్ర నిర్మాణం పూర్తి కావాల్సి ఉండగా కరోనా కారణం వల్ల చిత్ర నిర్మాణం ఆగిపోయింది.కరోనా వల్ల లేట్ అవుతున్న నేపథ్యంలో ఫైనాన్స్ లాంటివి అన్నింటినీ కలిపి ఈ సినిమాకు దాదాపుగా 38 కోట్ల రూపాయల బడ్జెట్ అయిందని సమాచారం.ఇదే కనుక నిజమైతే నాగచైతన్య కెరీర్లో హైయెస్ట్ బడ్జెట్ మూవీగా తన లవ్ స్టోరీ ఉంటుంది.
మజిలీ సినిమా ద్వారా సక్సెస్ అందుకున్న నాగచైతన్య, ఫిదా సినిమా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించిన సాయిపల్లవి వీరందరి కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం పై చిత్ర బృందం భారీ అంచనాలను పెట్టుకున్నారు.
అయితే ఈ సినిమాను సంక్రాంతి లేదా సమ్మర్ హాలిడేస్ లో విడుదల చేసే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు తెలుస్తోంది.