ప్రస్తుతం టాలీవుడ్ లోకి యంగ్ టాలెంటెడ్ దర్శకులు చాలా మంది వస్తున్నారు.వీళ్ళు ముందుగా షార్ట్ ఫిలిమ్స్, లో బడ్జెట్ మూవీస్, లేదంటే వెబ్ సిరీస్ లలో సత్తా చాటి తమని తాము ప్రూవ్ చేసుకొని మెయిన్ స్ట్రీమ్ లోకి తమ పేరు అందరికి వినిపించేలా చేసుకుంటున్నారు.
మంచి కంటెంట్ లతో కథలు సిద్ధం చేస్తూ నిర్మాతలని, హీరోలని మెప్పించే ప్రయత్నం చేసి అవకాశాలు పెంచుకుంటున్నారు.ఈ మధ్యకాలంలో చాలా మంది యువ దర్శకులు ఇదే దారిలో వచ్చారు.
అయితే వారిలో కమర్షియల్ ఫార్మాట్ లోకి వచ్చి స్టార్ దర్శకులుగా మారుతున్న వారు చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు.వాళ్ళ టాలెంట్ తో మంచి దర్శకుడు అని పేరు తెచ్చుకుంటున్నా స్టార్ హీరోలని డీల్ చేసే కెపాసిటీ తెచ్చుకోలేకపోతున్నారు.
అయితే తాజాగా ఓ యువ దర్శకుడు వెబ్ సిరీస్ లో ప్రూవ్ చేసుకొని ఏకంగా నాగ చైతన్యతో సిల్వర్ స్క్రీన్ పై దర్శకుడుగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు.
లూజర్ అనే వెబ్ సిరీస్ జీ 5లో రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అయ్యింది.
ఈ వెబ్ సిరీస్ లో ప్రియదర్శి,కల్పికా గణేష్, శశాంక్ లాంటి నటులు చేశారు.వీళ్ళందరికీ ఈ వెబ్ సిరీస్ మంచి పేరు తీసుకొచ్చింది.
ఈ సిరీస్తో అభిలాష్ రెడ్డి డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు.లూజర్ వెబ్ సిరీస్ నచ్చి నాగ చైతన్య అతనికి కథ చెప్పే అవకాశం ఇచ్చాడు.
అతడు చెప్పిన కథ నాగచైతన్యకి నచ్చడంతో వెంటనే ఒకే చెప్పాడని సమాచారం. లవ్ స్టోరీ సినిమా పూర్తి చేసిన తర్వాత చైతన్య విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో థాంక్యూ సినిమా చేయబోతున్నాడు.
దీని తర్వాత అభిలాష్ రెడ్డి డైరెక్షన్ లో చైతూ సినిమా ఉంటుందని తెలుస్తుంది.