నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవితో లవ్ స్టొరీ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా తర్వాత పరశురాంతో సినిమా చేయాల్సి ఉంది.
కాని పరశురాంకి మహేష్ బాబుతో సినిమా ఒకే అవడంతో ఇప్పుడు తన ఫ్యామిలీ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.నిజానికి చైతూ 14 రీల్స్ వారికి డేట్స్ ఇచ్చాడు.
అయితే పరశురాం సినిమా ఆగిపోవడంతో 14 రీల్స్ సంస్థ ఆ డేట్స్ ని దిల్ రాజుకి ఇచ్చేసింది.
ఇక ఇప్పటికే దిల్ రాజు మంచి కథని సిద్ధం చేసుకొని చైతూకి చెప్పడంతో ఇప్పుడు దానిని సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి రెడీ అవుతున్నారు.
అయితే ఎప్పుడు సొంత కథలు మాత్రమే రాసుకొని సినిమాలు తీసే విక్రమ్ కుమార్ కి వరుసగా రెండు ఫ్లాప్ లు పడటంతో దిల్ రాజు అతని కథని నమ్మలేదు.బివిఎస్ రవి రాసిన కథని విక్రమ్ కి అప్పగించి దానిని దర్శకత్వం చేసే అవకాశం ఇచ్చాడు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో తనని తాను ప్రూవ్ చేసుకోవడం అవసరం కాబట్టి విక్రమ్ కుమార్ కూడా ఇదే కథని తనశైలికి తగ్గట్లు మార్చుకొని చైతూతో ఆవిష్కరించే ప్రయత్నం చేయడానికి రెడీ అయ్యాడు.ఇక లాక్ డౌన్ ముగిసిన వెంటనే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని మొదలు పెట్టడానికి దిల్ రాజు రెడీ అవుతున్నాడు.