కరోనా కారణంగా ఎన్నో రోజులుగా థియేటర్స్ దగ్గర సందడి లేకుండా పోయింది.కానీ మళ్ళీ లవ్ స్టోరీ సినిమాతో థియేటర్స్ దగ్గర సందడి వాతావరణం నెలకొంది.
ఈ సినిమా రెస్పాన్స్ చుస్తే మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి మంచి రోజులు రాబోతున్నాయని అనిపిస్తుంది.ఏ ఇండస్ట్రీలో లేని విధంగా మన టాలీవుడ్ లో సినిమాలను విడుదల చేస్తున్నారు.
మంచి కంటెంట్ ఉన్న సినిమాలు వస్తే మన టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడు సినిమాలను ఆదరిస్తూనే ఉంటారని మరొకసారి రుజువయ్యింది.
లవ్ స్టోరీ సినిమాలో నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా నటించారు.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.దీంతో ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వస్తున్నాయి.ఈ సినిమా ముందు నుండి కూడా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా.పవన్ సి హెచ్ అందించిన సంగీతం సూపర్ హిట్ అవ్వడంతో ఈ సినిమాపై బాగా అంచనాలు పెరిగాయి.
ఈ సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవి జంట కూడా నటన పరంగా ది బెస్ట్ ఇచ్చారనే చెప్పాలి.వీళ్ళ నటనతో ప్రేక్షకులను కట్టి పడేసారు.ఈ సినిమా అప్పుడే అయిపోయిందా అనేంతలా కనెక్ట్ అయ్యారు.ఇక ఈ సినిమా చిన్న బడ్జెట్ సినిమా అయినా కూడా భారీ ఓపెనింగ్స్ వచ్చాయి.మరి ఇంహత విజయాన్ని అందుకున్న సందర్భంగా చైతన్య సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు.
ఈ ఫొటోలో వ్ స్టోరీ చిత్ర యూనిట్ మొత్తం ఉంది.ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూ టీమ్ మొత్తం ఫోటో దిగారు.ఈ ఫోటోను చైతన్య సోషల్ మీడియాలో షేర్ చేసాడు.
ఈ ఫొటోతో పాటు చైతన్య తన ఆనందాన్ని కూడా వ్యక్తం చేసారు.లైఫ్ లో గుర్తుండిపోయే మెమొరీ అందించినందుకు ప్రేక్షకులకు టీమ్ అందరి తరపున ధన్యవాదాలు అంటూ చైతన్య పోస్ట్ లో తెలిపారు.