నాగచైతన్య మరియు సాయి పల్లవి జంటగా ఫిదా దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన లవ్ స్టోరీ సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యి ఏడాది కావస్తుంది.కరోనా వల్ల విడుదల వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది.
ఎట్టకేలకు ఈ సినిమా విడుదల అవుతుందని ఈ ఏడాది ఆరంభంలో అనుకుంటే కరోనా సెకండ్ వేవ్ వల్ల నిలిచి పోయింది.సరే వినాయక చవితి సందర్బంగా విడుదల చేస్తామని ప్రకటించారు.
మళ్లీ ఏం అనుకున్నారో ఏమో కాని వినాయక చవితికి సినిమాను విడుదల చేయడం లేదని ఈ నెల చివరి వారంలో విడుదల తేదీని ఖరారు చేయడం జరిగింది.చిత్ర యూనిట్ సభ్యుల వాదన ఏంటో కాని వినాయక చవితికి విడుదల చేయక పోవడం చాలా పెద్ద తప్పు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ముందు ముందు కరోనా మళ్లీ విజృంభించే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు.అందుకే నిన్న విడుదల చేసి ఉంటే అంతా బాగుండేది అంటూ టాక్ వినిపిస్తుంది.
పెద్ద ఎత్తున అంచనాలున్న లవ్ స్టోరీ సినిమాను విడుదల చేయడం కోసం సిద్దం చేశారు.
విడుదల చేసే సమయంలో ఏదైనా పండుగ లేదంటే ప్రత్యేక సెలవు ఉంటే ఓపెనంగ్స్ బాగుండేవి.వినాయక చవితికి విడుదల చేసి ఉంటే వరుసగా మూడు రోజులు భారీగా వసూళ్లు వచ్చేవి.ఇప్పుడు సిటీమార్ సినిమా విషయంలో అదే జరిగింది.
సిటీ మార్ కు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కేవలం మూడు రోజుల్లోనే సిటీమార్ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించబతోతుందట.ఈ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.అయితే లవ్ స్టోరీ ఈ పండుగకు వచ్చి ఉంటే వసూళ్లు పదుల కోట్లలో ఉండేవి అనేది టాక్.పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమా ను ఈ నెల చివర్లో విడుదల చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేమంటున్నారు.వినాయక చవితికి విడుదల చేయనందుకు లవ్ స్టోరీ మేకర్స్ మూల్యం చెల్లించాల్సి రావచ్చు అంటున్నారు.
మొత్తానికి లవ్ స్టోరీ సినిమా చిత్రీకరణ విషయంలో ఆలస్యం జరిగింది.అలాగే విడుదల విషయంలో ఆలస్యం చేసి తప్పు చేశారేమో అంటూ కొందరు శేఖర్ కమ్ముల తీరును విమర్శిస్తున్నారు.
అయితే సినిమా విడుదల తర్వాత సక్సెస్ అయితే ఈ విమర్శలన్నీ కూడా గాల్లో కొట్టుకు పోతాయి.