నాగ చైతన్య, సాయి పల్లవిల లవ్ స్టోరీ కి మిశ్రమ స్పందన వచ్చినా కూడా వసూళ్ల విషయంలో చాలా పాజిటివిటీ కనిపిస్తుంది.మొదటి మూడు రోజుల్లో సినిమా మొత్తం 22.3 కోట్ల రూపాయలను వసూళ్లు చేసింది.నైజాంలో ఈ సినిమా మొదటి మూడు రోజులకు గాను 8.16 కోట్ల రూపాయలను వసూళ్లు చేసింది.సీడెడ్ లో 2.73 కోట్ల రూపాయలు రాబట్టగలిగింది.ఉత్తరాంద్రలో దాదాపుగా రెండు కోట్ల రూపాయలు లవ్ స్టోరీకి వచ్చాయి.కృష్ణ లో 87 లక్షలు, నెల్లూరు లో 55 లక్షలు, ఈస్ట్ గోదావరిలో ఒక కోటి, వెస్ట్ గోదావరిలో 95 లక్షలు గుంటూరులో 1.15 లక్షల వసూళ్లు నమోదు అయ్యాయి.కర్ణాటక మరియు ఇతర రాష్ట్రాల్లో దాదాపుగా 90 లక్షల వసూళ్లు నమోదు అయ్యాయి.ఇక యూఎస్ లో 3.75 కోట్ల రూపాయలు వసూళ్లు అయ్యాయి.
తెలుగు రాష్ట్రాలు ఇతర ప్రాంతాల్లో కలిపి ఈ సినిమా మొత్తంగా మొదటి మూడు రోజుల్లో 22.3 కోట్ల రూపాయలను ఈ సినిమా రాబట్టిన నేపథ్యంలో ఇంకా రాబట్టాల్సిన మొత్తం ఎంత అనే చర్చ జరుగుతోంది.టాలీవుడ్ వర్గాల ద్వారా అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమా మొత్తంగా 32 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయింది.
సినిమా ను ప్రముఖ బయ్యర్లు శేఖర్ కమ్ముల మరియు సాయి పల్లవిపై నమ్మకంతో పెద్ద మొత్తానికి కొనుగోలు చేయడం జరిగింది.లవ్ స్టోరీకి వచ్చిన బజ్ నేపథ్యంలో పరిస్థితులు సాదారణంగా ఉంటే ఈ మొత్తం మొదటి మూడు రోజుల్లోనే వచ్చింది.
కాని కాస్త ఇబ్బందులు ఉన్నాయి. ఏపీలో టికెట్ల రేట్లు మరియు కరోనా భయం కారణంగా ఇంకా జనాలు పూర్తి స్థాయిలో థియేటర్లకు రావడం లేదు.
అయినా కూడా ఈ మొత్తంలో రాబట్టింది అంటే గొప్ప విషయమే.వచ్చే వీకెండ్ ముగిసే వరకు ఖచ్చితంగా లవ్ స్టోరీ సినిమా బ్రేక్ ఈవెన్ ను దక్కించుకుంటుందనే నమ్మకంను ట్రేడ్ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.