నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన మూవీ లవ్ స్టోరీ.ఈ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది.
ఏప్రిల్ 16వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా బిజినెస్ మొత్తం క్లోజ్ చేశారనే టాక్ వినిపిస్తుంది.నాగచైతన్య సినిమాల మాదిరిగానే తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ చేసింది.
కాని ఈసారి అదనంగా కన్నడం మరియు మలయాళం డబ్బింగ్ రైట్స్ ద్వారా భారీ మొత్తంను లవ్ స్టోరీ దక్కించుకున్నట్లుగా సమాచారం అందుతోంది.సాయి పల్లవిహీరోయిన్ అవ్వడం వల్ల ఆ రెండు భాషల్లో కూడా ఈ సినిమా ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
భారీ అంచనాల నడుమ రూపొందుతున్న లవ్ స్టోరీ సినిమా లో సాయి పల్లవి పాత్ర పై అంచనాలు భారీగా ఉన్నాయి.అందుకే ఈ సినిమా ను అక్కడ భారీ మొత్తంలో కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
లవ్ స్టోరీ సినిమా మొత్తం బిజినెస్ లో దాదాపుగా10 కోట్ల వరకు సాయి పల్లవి వల్ల అదనంగా జరిగింది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.దాదాపుగా 30 కోట్ల వరకు ఈ సినిమా బిజినెస్ చేసిందట.
సాదారణంగా అయితే నాగచైతన్య మూవీ 20 నుండి 25 కోట్ల వరకు బిజినెస్ చేస్తుంది.ఈ సినిమా అంత బిజినెస్ చేయడం వల్ల వసూళ్లు ఎలా ఉటాయా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా లవ్ స్టోరీ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం ఖాయం అంటున్నారు.శేఖర్ కమ్ముల ఫిదా చిత్రం తర్వాత చేసిన సినిమా అవ్వడంతో పాటు ఫిదా లో సాయి పల్లవి నటించడం వల్ల కూడా లవ్ స్టోరీ పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.
అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందనే నమ్మకంతో అంతా వెయిట్ చేస్తున్నారు.బయ్యర్లు కూడా ఈ సినిమా కోసం కాస్త ఎక్కువ ఖర్చు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.