అక్కినేని ఫ్యామిలీ కి చెందిన నాగచైతన్య మరియు అఖిల్ నటించిన కస్టడీ మరియు ఏజెంట్ సినిమా లు కాస్త అటు ఇటుగా ఒకే సారి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.సురేందర్ రెడ్డి దర్శకత్వం లో అఖిల్ హీరో గా రూపొందుతున్న ఏజెంట్ సినిమా గత ఏడాది నుండి వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది.
మొన్న సంక్రాంతి కి ఏజెంట్ సినిమా ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.
కానీ సంక్రాంతి కి పెద్ద సినిమాలు ఉన్న కారణంగా ఏజెంట్ సినిమా ను వాయిదా వేయడం జరిగింది.
సమ్మర్ కానుకగా ఏప్రిల్ లేదా మే నెలలో ఏజెంట్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.ఏజెంట్ సినిమా తో పాటు నాగచైతన్య హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా వెంకట్ ప్రభు దర్శకత్వం లో రూపొందిన కస్టడీ సినిమా కూడా అదే సమయంలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇప్పటికే మే నెలలో కస్టడీ సినిమా ను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.డేట్ కూడా రావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ సమయం లో ఏజెంట్ సినిమా కూడా అదే టైం లో రాబోతున్నట్లుగా ఫిలిం మేకర్స్ పేర్కొనడంతో అక్కినేని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అక్కినేని బ్రదర్స్ బాక్సాఫీస్ వార్ తప్పదేమో అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.
సోషల్ మీడియా లో అక్కినేని బ్రదర్స్ యొక్క సినిమా ల విడుదల గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.అతి త్వరలోనే రెండు సినిమా లకు సంబంధించిన అఫీషియల్ విడుదల తేదీ లపై స్పష్టత రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.ఈ రెండు సినిమాలపై కూడా అక్కినేని అభిమానులు చాలా ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే.