శేఖర్ కమ్ముల దగ్గర నాగ్ అశ్విన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు.లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, హ్యాపీ డేస్, ఇలా ఎన్నో చిత్రాలకు సహాయ దర్శకుడు గా పనిచేశాడు.
నాని తో ఎవడే సుబ్రమణ్యం అనే చిత్రాని తీశాడు.ఈ చిత్రం డివైడ్ టాక్ ను తెచ్చుకున్న వసూళ్లు మాత్రం బాగానే రాబట్టింది.
ఆ తర్వాత అలాంటి నటి సావిత్రి బయోపిక్ను తెరరూపంలోకి తెచ్చి పెద్ద హిట్టును కొట్టాడు.కీర్తి సురేశ్ లీడ్ రోల్ లో నటించింది.
ఈ చిత్రం తర్వాత అయిన నిర్మాతగా కూడా మారాడు.ఓ వైపు సినిమాలకు దర్శకత్వం వహిస్తూనే మరో వైపు చిన్న చిన్న మంచి కంటెంట్ ఉన్న సినిమాలను నిర్మిస్తున్నాడు.
అనుదీప్ కేవి దర్శకత్వంలో జాతి రత్నాలు అనే చిత్రాని నాగ్ అశ్విన్ స్వప్న సినిమాస్ పై నిర్మించాడు.ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రామకృష్ణ లు ప్రధాన పాత్రలో నటించారు.
ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను ప్రభాస్ చేతుల మీదుగా ఇటీవలే విడుదల చేశారు.
కామిడీ ప్రధానంగా ఈ చిత్రం రూపొందింది.
శివరాత్రి కి అంటే మార్చి 11వతేదీన ఈ చిత్రం విడుదల అవ్వుతుంది.ఈ సందర్భంగా జాతి రత్నాలు టీమ్ ప్రమోషన్ కార్యక్రమంలో చాలా బిజీగా ఉంది.
ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ మాట్లాడుతూ జాతి రత్నాలు ట్రైలర్ కు మంచి స్పందన వస్తుంది.ఇంతగా అదరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశాడు.
దర్శకుడు అనుదీప్ కేవి కి స్పెషల్ థాంక్స్ చెప్పాలి.తాను రాసుకున్న స్క్రిప్ట్ లో ఏదైతే ఉందో దానినే తెరపైన చూపించాడు అన్నారు ఈ సందర్భంలోనే నాగ్ అశ్విన్ ప్రభాస్ తో చేయబోయే సినిమా గురించి ఆసక్తి కర వ్యాఖ్యలు చేశాడు.
త్వరలోనే ప్రభాస్ తో సినిమాను సెట్స్ పైకి వెళ్లనున్నది.ఇది ఒక్క సైన్స్ ఫిక్షన్ మూవీ ఇది అందరికి తెలిసిన విషయమే.
ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశం చాలా ఆకట్టుకొనున్నది.ఎంతో కష్టపడి స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశాను.
ప్రభాస్ అభిమానులు, ప్రభాస్ నుండి ఏదైతే కోరుకుంటున్నారో అన్నీ అంశాలు ఈ చిత్రంలో ఉండనున్నాయి అని తెలిపాడు.ఏమాత్రం డిస్సాపాయింట్ లేకుండా ఈ చిత్రాని తెరకెక్కించనున్నట్లుగా తెలిపాడు.
అలాగే ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడీగా దీపికా పదుకునే హీరోయిన్ గా నటించనున్నది
.