ప్రస్తుతం ప్రభాస్ ఆల్ ఇండియా సూపర్ స్టార్.ఆయన ఏ సినిమా చేస్తున్నా, ఏ సినిమా చేయబోతున్నా కూడా ఇండియా వ్యాప్తంగా చర్చ జరుగుతూనే ఉంది.
ప్రస్తుతం ఓ డియర్ అనే చిత్రాన్ని ప్రభాస్ చేస్తున్న విషయం తెల్సిందే.ఆ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సాహో చిత్రంతో ప్రభాస్కు బాలీవుడ్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటో తేలిపోయింది.ఇప్పుడు ఆయన తదుపరి చిత్రం గురించి చర్చ జరుగుతోంది.
రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న జాను అలియాస్ ఓ డియర్ చిత్రం తర్వాత ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి.వీరిద్దరి కాంబో కోసం అశ్వినీదత్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.మహానటి వంటి బ్లాక్ బస్టర్ అవార్డు ఫిలింను తెరకెక్కించిన తర్వాత దర్శకుడు నాగ అశ్విన్ కొత్త సినిమాను ఇంకా మొదలు పెట్లలేదు.
ఎట్టకేలకు ప్రభాస్ను కలిసి ఈయన స్క్రిప్ట్ వినిపించాడట.త్వరలోనే వీరిద్దరి కాంబో మూవీ అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.యూవీ క్రియేషన్స్ మరియు వైజయంతి మూవీస్ వారు కలిసి ఈ సినిమాను నిర్మిస్తారని కూడా తెలుస్తోంది.
వంద కోట్ల బడ్జెట్లో ఒక యూనివర్శిల్ సబ్జెక్ట్తో విభిన్నమైన నేపథ్యంలో ఈ చిత్రాన్ని చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.వచ్చే ఏడాదిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.