బాలీవుడ్ లో తిరుగులేని హీరోయిన్ గా వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ముద్దుగుమ్మ శ్రద్ధా కపూర్.అటు డాన్స్ లోను, ఇటు యాక్టింగ్ లోను సత్తా చూపిస్తూ బెస్ట్ యాక్టర్ అనిపించుకుంటున్న శ్రద్ధా కపూర్ గ్లామర్ కి కూడా బాలీవుడ్ దర్శక, నిర్మాతలు ఫిదా అయిపోయి ఆమెకి అవకాశాలు ఇస్తున్నారు.
ఇక ఈ అమ్మడుకి సౌత్ లో కూడా మంచి క్రేజ్ ఉంది.డార్లింగ్ ప్రభాస్ తో సాహో సినిమాలో రొమాన్స్ చేసిన ఈ అమ్మడుకి మంచి మార్కులే పడ్డాయి ప్రభాస్ కి కరెక్ట్ పెయిర్ గా ఈ సినిమాలో శ్రద్దా కనిపించింది.
తెలుగు ప్రేక్షకులని సైతం ఆకట్టుకుంది.ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి.
అయితే ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ ని ఈ అమ్మడు సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది.డార్లింగ్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ సినిమా తెరకెక్కుతుంది.
ఈ సినిమాని డిసెంబర్ లో స్టార్ట్ చేసే అవకాశం ఉంది.
భారీ బడ్జెట్ తో తెరకెక్కబోయే ఈ సినిమాలో హీరోయిన్ గా ముందుగా దీపికా పదుకునేని తీసుకోవాలని దర్శకుడు భావించాడు.
అయితే ఆమె రెమ్యునరేషన్ పరంగా ప్రభాస్ కంటే ఎక్కువగా డిమాండ్ చేస్తుందని తెలుస్తుంది.ఇప్పటికే ఒక హాలీవుడ్ సినిమాలో నటించి ఉండటం వలన రెమ్యునరేషన్ విషయంలో అస్సలు తగ్గడం లేదని, దీంతో ఆమెని పక్కన నాగ్ అశ్విన్ కైరా అద్వానీ పేరుతో పాటు శ్రద్ధా కపూర్ పేరు కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది.
శ్రద్ధా ఇప్పటికే సాహో సినిమాలో ప్రభాస్ తో రొమాన్స్ చేసి ఉండటంతో ఈ సినిమాలో మరోసారి అతనితో జత కట్టడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తుంది.ప్రభాస్ తో తన జోడీకి రెస్పాన్స్ బాగుండటంతో అతనితో మరోసారి ఆడిపాడేందుకు ఆసక్తిగానే ఉన్నట్లు తెలుస్తుంది.
త్వరలో దీనికి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు.ప్రస్తుతం రాదేశ్యాం సినిమాని వీలైనంత వేగంగా పూర్తి చేసి నెక్స్ట్ నాగ్ అశ్విన్ సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళడానికి ప్రభాస్ కూడా రెడీ అవుతున్నాడు.
ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ కాగా ప్రస్తుతం క్యాస్టింగ్ సెలక్షన్ లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది.
.