డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో రాదేశ్యామ్ సినిమా చేస్తున్నాడు.పీరియాడికల్ లవ్ స్టొరీగా ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఈ సినిమా షూటింగ్ చివరిదశకి వచ్చేసింది.దీని తర్వాత మహానటి ఫేం నాగ్ అశ్విన్ తో సైన్స్ ఫిక్షన్ స్టొరీతో సినిమా చేయబోతున్నాడు.
ఈ సినిమాని భారీ బడ్జెట్ తో అశ్వినీదత్ నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమాకి సంబందించిన ప్రీప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాని ఇండియా బాషలతో పాటు ఇండియన్-హాలీవుడ్ మూవీగా ఆవిష్కరించాలని నాగ్ అశ్విన్ భావిస్తున్నాడు.దానికోసం ఇప్పటికే ఇండియా నటులతో పాటు హాలీవుడ్ నటులని కూడా ఎంపిక చేసుకుంటున్నట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాని విజువల్ వండర్ గా ఆవిష్కరించడానికి రెడీ అవుతున్న దర్శకుడు నాగ్ అశ్విన్ దాని కోసం టెక్నికల్ టీమ్ ని కూడా హాలీవుడ్ నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు తెలుస్తుంది.సినిమాకి కెమెరామెన్ తో పాటు ఇతర సాంకేతిక బృందం అంతా హాలీవుడ్ లో పెద్ద ఇంకా ఈ చిత్రం కోసం పని చేసినవారిని తీసుకుంటున్నాడు.
అవెంజర్స్ కోసం పని చేసిన కొందరు టెక్నీషియన్స్ తో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.విజుల్ ఎఫెక్ట్స్ తో పాటు ఇంకా చిత్రానికి సంబంధించిన సౌండ్ ఎఫెక్ట్స్ ను కూడా హాలీవుడ్ రేంజ్ లోనే ప్లాన్ చేయడంతో సాంకేతిక బృందం అంతా అక్కడి వారు అయితే క్వాలిటీ విషయంలో వెనక్కి తగ్గే అవకాశం ఉండదని భావించి ఇలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.