మహానటి సినిమాతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్.సావిత్రి బయోపిక్ గా తెరకెక్కిన ఆ సినిమాతో జాతీయ అవార్డు సైతం దక్కించుకున్నాడు.
వెండితెరపై మహానటి సావిత్రిని మరోసారి పరిచయం చేసిన నాగ్ అశ్విన్ దర్శకత్వ ప్రతిభ అందరూ ప్రశంసలు కురిపించారు.ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ యువ దర్శకుడు ఏకంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో పాన్ ఇండియా సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు.
అశ్వినీదత్ ఈ సినిమాని సుమారు 450 కోట్లతో నిర్మించడానికి రెడీ అయ్యారు.ఇక సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కబోయే ఈ సినిమా కోసం దీపికా పదుకునేని హీరోయిన్ గా ఖరారు చేశారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా పూర్తి చేయడంతో పాటు తరువాత ఓ రెండు నెలలు ఆది పురుష్ కోసం డేట్స్ ఇచ్చారు.ఈ నేపధ్యంలో ఈ సినిమా షూటింగ్ కాస్తా ఆలస్యం అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.
డిసెంబర్ లో షూటింగ్ స్టార్ట్ చేసిన ప్రభాస్ పూర్తి స్థాయిలో స్టార్ట్ కావడానికి మరికొంత సమయం పడుతుంది.అయితే ఈ ఖాళీ సమయంలో నాగ్ అశ్విన్ ఓ షార్ట్ వెబ్ ఫిలిం ప్లాన్ చేసుకున్నాడు.
నెట్ ఫ్లిక్స్ కోసం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో శృతి హాసన్ లీడ్ రోల్ లో ఓ వెబ్ షార్ట్ ఫిలింని డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది.హైదరాబాద్లోని సారథి స్టూడియోస్లో ఈ వెబ్ ఫిలిం కోసం ఓ ప్రత్యేకమైన సెట్ వేసి అందులో షూటింగ్ కూడా మొదలుపెట్టారని సమాచారం.30 నిమిషాల నిడివి గల ఈ వెబ్ ఫిలింలో శృతిహాసన్ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని తెలుస్తుంది.దీంతో పాటు ఓ వెబ్ సిరీస్ కూడా వర్క్ అవుట్ చేస్తున్నాడని టాక్ నడుస్తుంది.