ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్ ఆ తర్వాత చాలా కాలానికి మహానటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.సావిత్రి జీవితాన్ని ప్రేక్షకుల కళ్ల ముందు ఆవిష్కరించిన దర్శకుడు ఆ సినిమాతో జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు.
జాతీయ అవార్డు సాధించిన దర్శకుడిగా జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.ఆ కారణంగా ఈ దర్శకుడు భారీ సినిమా చేసేందుకు గాను ప్రభాస్ తో సినిమాకు రెడీ అయ్యాడు.
ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే నటిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.
ఇప్పుడు ఈ సినిమాలో బాలీవుడ్ మెగా స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.దాంతో సినిమా ఓ రేంజ్ లో ఉంటుందనే టాక్ నుంచి వీరలెవల్లో ఉంటుందని టాక్ వస్తుంది.
ఈ నేపథ్యంలో సినిమాకు పెరిగిన అంచనాలను దర్శకుడు నాగ్ అశ్విన్ రీచ్ అవ్వగలడా లేదా అనే అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు.ఇటీవలే ఈ సినిమా పాన్ ఇండియా సినిమా కాదు పాన్ వరల్డ్ మూవీ అంటూ మరింత అంచనాలు పెంచే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ప్రభాస్ బాహుబలి తో బాలీవుడ్ లో మంచి గుర్తింపు దక్కించుకున్న మాట వాస్తవమే కానీ 500 కోట్లతో ప్రభాస్ తో సినిమా తీస్తే అది అంత సులభంగా రికవరీ అయ్యే అవకాశం లేదు.అందుకే దీపికా పదుకునే మరియు అమితాబ్ బచ్చన్ వంటి సూపర్ సినిమాలో దించుతున్నాడు.
దర్శకుడు అంచనాలు మరింతగా పెంచుతూ తనపై తానే అదనపు భారం వేసుకుంటున్నాడు అంటూ టాక్ వినిపిస్తుంది.మరి ఆ భారం ను దర్శకుడు నాగ అశ్విన్ స్థాయిలో మోయగలడా అనేది చూడాలి.