బాలీవుడ్లో దాదాపుగా స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించుకున్న టువంటి హీరోయిన్లలో కత్రినాకైఫ్ ఒకరు.అయితే ఈ అమ్మడు ప్రస్తుతం పలు భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తూ బిజిబిజీగా గడుపుతోంది.
అప్పట్లో టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన మల్లీశ్వరి మరియు నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన అల్లరి పిడుగు అనే చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులని బాగానే మెప్పించింది.ఏమైందో ఏమో గాని ఈ రెండు చిత్రాల్లో నటించిన తర్వాత కత్రినా అసలు టాలీవుడ్ పై కన్నెత్తి కూడా చూడలేదు.
అయితే తాజాగా కత్రినా కైఫ్ టాలీవుడ్లోకి దాదాపుగా 15 సంవత్సరాల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నట్లు పలు వార్తలు నెట్లో వైరల్ అవుతున్నాయి.
అయితే ఇంతకీ విషయం ఏంటంటే ఇటీవలే అలనాటి అందాల తార మరియు విలక్షణ నటి సావిత్రి జీవిత గాథను కళ్ళకు కట్టినట్లు తెరకెక్కించిన దర్శకుడు నాగ్ అశ్విన్ తో టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా కత్రినా కైఫ్ ని తీసుకోవడానికి ఇప్పటికే నాగ్ అశ్విన్ ఆమెను సంప్రదించి కథని వినిపించినట్లు సమాచారం.అయితే ఈ చిత్రం పాన్ ఇండియా చిత్రం కావడంతో కత్రినా కైఫ్ వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
అయితే ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ కి సంబంధించినదిగా ఉండనుంది.అందువల్ల ఈ చిత్రానికి కత్రినాకైఫ్ ని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.అంతేగాక తొందర్లోనే దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని పట్టా లెక్కించడానికి పలు సన్నాహాలు చేస్తున్నాడు.
అయితే ప్రస్తుతం కత్రినా ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన “సూర్యవంశి” అనే బాలీవుడ్ చిత్రంలో నటించింది.ఈ చిత్రం ఈ నెల 24వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండంగా విడుదల కానుంది.అయితే ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిండడంతో కొంతకాలం పాటు ఈ చిత్రం విడుదలను వాయిదా వేయనున్నట్లు సమాచారం.