గ్యాంగ్ స్టర్ నయీమ్ ప్రధాన అనుచరుడు శేషన్నను పోలీసులు హైదరాబాద్ లోని చంచల్ గూడ జైలుకు తరలించారు.ముందుగా కోర్టులో హాజరు పరిచిన అనంతరం రిమాండ్ కి తరలించారు.
కాగా రిమాండ్ రిపోర్ట్ లో పలు కీలక అంశాలను పేర్కొన్నారు.శేషు అన్నాను అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగా తెలిపారు.
శేషన్న అనేక నేరాలకు పాల్పడినట్లు చెబుతున్న పోలీసులు.ఆయుధాలు చూపించి బెదిరింపులు, సెటిల్మెంట్లు చేస్తున్నాడని రిపోర్టులో వెల్లడించారు.
అంతేకాకుండా మావోయిస్టు సీనియర్ నాయకులతో కూడా శేషన్నకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు.శేషన్నకు అనేక షెల్టర్లు ఉన్నాయని, వదిలితే పారిపోతాడని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
నిన్న ఓ సెటిల్మెంట్ చేయటానికి వచ్చిన శేషన్నను పక్కా సమాచారంతో గోల్కొండ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.