జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్.ఏపీ సీఎం వైఎస్ జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వర్షం కురిపించారు.
ముఖ్యమంత్రిగా జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పరిస్థితులు మొత్తం అయోమయం గందరగోళం గా మారాయని పేర్కొన్నారు.ఇటీవల గుంటూరులో విలేకరులతో మాట్లాడిన నాదెండ్ల మనోహర్.
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలాల వివాదంపై స్పందిస్తూ ఈ విషయంలో జగన్ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.న్యాయబద్ధంగా రాష్ట్రానికి రావాల్సిన నీటి హక్కుల విషయంలో జగన్ ఎందుకు పోరాడటం లేదని.
అనుమానం వ్యక్తం చేశారు.
జగన్ కుటుంబానికి చెందిన వ్యక్తి తెలంగాణలో పార్టీ పెట్టి ఒకలా మాట్లాడుతుంటే మరోపక్క వైసిపి పార్టీ ప్రజాప్రతినిధులు ఇక్కడ మరో రకంగా మాట్లాడుతున్నారని.సీరియస్ అయ్యారు.అదేరీతిలో రైతు భరోసా కేంద్రాలు.
పూర్తిగా మోసమని.రైతులను తమ వాలంటీర్లు ద్వారా పార్టీలుగా విభజించారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.
ఇక అదే రీతిలో నీటి వివాదం విషయంలో త్వరలో పవన్ కళ్యాణ్ నీటిపారుదల నిపుణులతో సమావేశం అవుతారు అని స్పష్టం చేశారు.రాష్ట్రంలో చాలా చోట్ల జనసేన పార్టీ కార్యకర్తలపై దాడులు ఉన్న కొద్దీ పెరుగుతున్నాయని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
ఇంకా ఇదే రీతిలో ఇటీవల జనసేన పార్టీ నాయకులు పసుపులేటి శివప్రసాద్ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో వాళ్ళ కుటుంబానికి 5 లక్షల చెక్కు అందించడం జరిగింది.