టాలీవుడ్ లో హీరోయిన్ గా నన్ను దోచుకుందువటే సినిమాతో ఎంట్రీ ఇచ్చి నటిగా మంచి మార్కులు కొట్టేసిన భామ నభా నటేష్.కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కెరియర్ ప్రారంభించిన నాలుగేళ్ల తర్వాత టాలీవుడ్ అవకాశం దక్కించుకున్న ఈ అమ్మడు మొదటి సినిమాతో క్యూట్ గర్ల్ ఇమేజ్ సొంతం చేసుకుంటే రెండో సినిమా ఇస్మార్ట్ శంకర్ తో పూర్తిగా పూరీ భామగా మారిపోయి హాట్ అందాలు ఆరబోసింది.
దీంతో ఈ అమ్మడు మీద టాలీవుడ్ దర్శకుల ఫోకస్ పడింది.దీంతో అనుకున్నట్లుగానే అవకాశాలు ఈ అమ్మడుని వెతుక్కుంటూ వస్తున్నాయి.
ఇస్మార్ట్ తర్వాత డిస్కో రాజా సినిమాలో రవితేజతో జత కట్టిన ఈ అమ్మడుకి ఆ సినిమా డిజాస్టర్ అందించింది.
అయిన కూడా ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ తో సోలో బ్రతుకే సో బెటరు, బెల్లంకొండ శ్రీనివాస్ తో అల్లుడు అదుర్స్ సినిమాలు చేస్తుంది.
ఈ రెండు సినిమాలు కమర్షియల్ జోనర్ లోనే తెరకేక్కుతున్నాయి.మళ్ళీ రవితేజ కి జోడీగా రమేష్ వర్మ సినిమాలో నభా నటేష్ ని హీరోయిన్ గా తీసుకున్నారని తెలుస్తుంది.
ఈ ఏడాది రిలీజ్ కి రెడీగా ఉన్న రెండు సినిమాలు హిట్ అయితే నభా కూడా కమర్షియల్ హీరోయిన్ గా మారిపోవడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తుంది.అదే జరిగితే పూజా హెగ్డే, రష్మిక మందన స్థానంలోకి ఈ భామ కూడా వచ్చేసే అవకాశం ఉంది.