తెలుగులో వచ్చీరాగానే నర్తనశాల చిత్రంతో ప్లాప్ ఎదుర్కొన్నప్పటికీ ఇస్మార్ట్ శంకర్ తో చిత్రంతో నభా నటేశ్ మంచి హిట్ అందుకుంది.ఇంక అప్పటి నుంచి స్టార్ హీరోల చిత్రాల్లో నటించే అవకాశం దక్కించుకుంది ఈ అమ్మడు.
అయితే ప్రస్తుతం ఈ అమ్మడు సాయి ధరమ్ తేజ్ నటిస్తూన్నటువంటి “సోలో బ్రతుకే సో బెటర్” అనే చిత్రం లో హీరోయిన్ గా నటిస్తోంది.
అయితే ఇస్మార్ట్ శంకర్ మంచి హిట్ అవడంతో ఈ అమ్మడి రెమ్యూనరేషన్ పై పలు రకాల వార్తలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.
ఇందులో ముఖ్యంగా ఇస్మార్ట్ శంకర్ హిట్ అయిన తర్వాత ఈ అమ్మడు ఒక్కసారిగా తన రెమ్యూనరేషన్ ని డబల్ చేసిందని అంతేగాక స్టార్ హీరో ఫేమ్ ఉన్న హీరోలతో మాత్రమే నటించడానికి సుముఖంగా ఉన్నట్లు పలు వార్తలు వినిపించాయి.దీంతో ఈ వార్తలపై తాజాగా నభా నటేష్ స్పందించింది.
ఇందులో భాగంగా మొదటగా తను రెమ్యూనరేషన్ పెంచలేదని స్పష్టత ఇచ్చింది.అలాగే తనకు ఉన్నటువంటి క్రేజ్ ను బట్టి రెమ్యునరేషన్ తీసుకుంటానని అంతేగాని ఎక్కువ, తక్కువ అని ఏమీ ఉండదని అన్నారు.అంతేగాక తన పారితోషకం విషయంపై తనకు పూర్తి క్లారిటీ ఉందని ఎవరు ఏమన్నాతాను పట్టించుకోనని అన్నారు.అలాగే దర్శక నిర్మాతలు కూడా ఎవరికీ ఊరికే డబ్బులు ఇవ్వరినీ వాళ్ళకుండే టాలెంట్, క్రేజ్ ని బట్టి మాత్రమే పారితోషకాన్ని డిసైడ్ చేస్తారని చెప్పుకొచ్చింది ఈ అమ్మడు.