ప్రస్తుతం టాలీవుడ్లో ఎలాంటి సినిమా షూటింగ్లు జరగడం లేదనే విషయం తెలిసిందే.ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భయాందోళనలు నెలకొనడంతో అన్ని దేశాల ప్రభుత్వాలు సినిమా షూటింగ్లను రద్దు చేశాయి.
దీంతో హీరో హీరోయిన్లు వారి వారి ఇళ్లకే పరిమితమయ్యారు.కానీ తనను ‘అల్లుడు’ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడని అంటోంది ఇస్మార్ట్ పోరి.
పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నభా నటేష్, ప్రస్తుతం టాలీవుడ్లో వరుసబెట్టి సినిమాలు చేస్తోంది.తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘అల్లుడు అదుర్స్’ అనే సినిమాలో నభా హీరోయిన్గా నటిస్తోంది.
ఈ సినిమా షూటింగ్ను శరవేగంగా జరుపుతున్నారు చిత్ర యూనిట్.సినిమా షూటింగ్ల రద్దు విషయాన్ని పక్కనబెట్టి మరీ ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు నభా నటేష్ బెంగుళూరు నుండి హైదరాబాద్కు చక్కర్లు కొడుతున్నట్లు తెలుస్తోంది.కరోనా వైరస్ వ్యా్ప్తిలో ఉన్న ఈ సమయంలో తనను ఇలా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు న్యాయం అని నభా వాపోతుంది.
అయితే ఈ షూటింగ్ ఎట్టిపరిస్థితుల్లో జరిగేందుకు ముఖ్య కారణం బెల్లంకొండ సురేష్ అని తెలుస్తంది.మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మాత్రం చిత్ర యూనిట్ నుండి ప్రకటన రావాల్సి ఉంది.
.