భద్రాచలంలో నూతనంగా నిర్మించిన కాసం వస్త్రాలయం ప్రారంభించడానికి భద్రాచలం వచ్చిన సినీనటి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.ముందుగా కాసం వస్త్రాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి పూజలో పాల్గొని అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
సినీనటి నబా నటేష్ తో పాటు కాసం వస్త్రాలయాల చైర్మన్ కాసం ఓం నమశ్శివాయ జ్యోతి ప్రజ్వలన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అనంతరం దుకాణానికి వచ్చిన భద్రాచలం పట్టణ ప్రజలతో సినీనటి నభా న టేస్ మాట్లాడి సినిమా పాటకు డ్యాన్స్ వేశారు.
అనంతరం చైర్మన్ కాసం ఓం నమశ్శివాయ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలోని ప్రజలకు తక్కువ ధరలకు వస్త్రాలను అందించాలని ఏజెన్సీ ప్రాంతమైన భద్రాచలంలో దుకాణాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో భద్రాచలం శాసనసభ్యులు పోదాం వీరయ్య హాజరయ్యారు.
కాసం వస్త్రాలయ చైర్మన్ కాసం ఓం నమశ్శివాయ ఎమ్మెల్యే పోదాం వీరయ్యని షెల్వార్ సన్మానించారు.