టాలీవుడ్లో తెరకెక్కుతున్న చిత్రాల్లో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘నారప్ప’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు వెంకీ రెడీ అవుతున్నాడు.
కాగా ఈ సినిమాతో తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కేందుకు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ప్రయత్నిస్తున్నాడు.గతంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటడంతో మరోసారి వెంకీతో కలిసి హిట్ అందుకునేందుకు రెడీ అవుతున్నాడు.
ఈ సినిమా షూటింగ్ను ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.అయితే కరోనా కారణంగా నారప్ప చిత్ర షూటింగ్ వాయిదా పడింది.దీంతో ఈ సినిమా షూటింగ్ తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ను చిత్ర యూనిట్ తిరిగి ప్రారంభించింది.
కానీ ఈ షూటింగ్లో విక్టరీ వెంకటేష్ పాల్గొనడం లేదని తెలుస్తోంది.ఇతర నటీనటులపై కొన్ని కీలక సన్నివేశాలు ఈ షూటింగ్లో తెరకెక్కిస్తున్నారని, త్వరలోనే వెంకటేష్ కూడా ఈ షూటింగ్లో జాయిన్ అవుతాడని చిత్ర వర్గాలు తెలిపాయి.
ఇక ఈ సినిమాలో వెంకటేష్ సరసన అందాల భామ ప్రియమణి హీరోయిన్గా నటిస్తోంది.కాగా ఈ సినిమాలో కార్తీక్ రత్నం, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమాను తమిళ సూపర్ హిట్ మూవీ ‘అసురన్’కు రీమేక్గా తెరకెక్కిస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందే.ఈ సినిమా తమిళంలో సాధించిన విజయాన్ని తెలుగు రీమేక్తో కూడా సాధిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
ఇక ఈ సినిమాను కలైపులి ఎస్ థాను, సురేష్ బాబులు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.కాగా ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.