టాలీవుడ్లో తెరకెక్కుతున్న చాలా సినిమాలు ప్రస్తుతం నెలకొన్న కరోనా వైరస్ ప్రభావంతో వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.ఈ సినిమాల్లో కొన్ని ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉండగా, మరికొన్ని షూటింగ్ మొదలుపెట్టుకోవాల్సింది.
కానీ కొన్ని సినిమాలు మాత్రం ఎప్పటినుండో ఇదిగో అదిగో అంటూ తెలుగు ప్రేక్షకులను ఊరిస్తూ వస్తున్నాయి.ఈ సినిమాలు కూడా కరోనా దెబ్బకు పత్తా లేకుండా పోయాయని చెప్పాలి.
ముఖ్యంగా సీనియర్ హీరోలైన విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగార్జునలకు సంబంధించిన సినిమాలు ఇప్పటివరకు పత్తా లేకుండా పోవడంతో జనాలు దాదాపు వాటిని మరిచిపోయారని చెప్పాలి.తమిళంలో సూపర్ హిట్గా నిలిచిన అసురన్ చిత్రాన్ని తెలుగులో ‘నారప్ప’ పేరుతో తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించడంతో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కానీ ప్రస్తుతం నెలకొన్న పిరస్థితుల కారణంగా ఈ సినిమా ఇప్పట్లో తిరిగి పట్టాలెక్కే సూచనలు కనిపించడం లేదు.ఈ లెక్కన ఈ సినిమాను వచ్చే ఏడాదిలో కూడా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
ఇక అక్కినేని నాగార్జున ఎప్పటి నుండో తెరకెక్కించాలని చూస్తున్న బంగార్రాజు చిత్రం కూడా ఇప్పట్లో పట్టాలెక్కే సూచనలు కనిపించడం లేదు.కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమాను ఈయేడు ఎలాగైనా పట్టాలెక్కించాలని చిత్ర యూనిట్ భావించింది.
కానీ ఈ సినిమాపై నాగ్ పెద్దగా ఆసక్తి కనబర్చకపోవం, కరోనా మహమ్మారి కారణంగా మరింత వాయిదా పడటంతో ఈ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కే అవకాశమే లేకుండా పోయింది.ఇలా ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు పత్తాలేకుండా పోతుండటంతో ప్రేక్షకులు ఆందోళన చెందుతున్నారు.