అల్లరి నరేష్ నటించిన లేటెస్ట్ మూవీ నాంది, ఇటీవీల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్ సంగతి తెలిసిందే.ఈ సినిమాను దర్శకుడు విజయ్ కనకమేడల అద్భుతంగా తెరకెక్కించగా, ఈ సినిమాను గతేడాదే రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.
కానీ కరోనా కారణంగా ఈ సినిమా వాయిదా పడింది.దీంతో ఫిబ్రవరి 19న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా మంచి అంచనాల నడుమ రిలీజ్ చేశారు.
ఇక ఈ సినిమాకు తొలిరోజే పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాతో అల్లరి నరేష్ చాలా ఏళ్ల తరువాత అదిరిపోయే హిట్ అందుకున్నాడు.
రిమాండ్లో ఉన్న ఓ ఖైదీ పట్ల జరిగే అన్యాయాన్ని ఈ సినిమాలో మన కళ్లకు కట్టినట్లు చూపించారు చిత్ర యూనిట్.
ఇక లాయర్ పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ సినిమాలో మరోసారి అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.మొత్తంగా సత్తా ఉన్న కంటెంట్ను ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారని మరోసారి నాంది చిత్రం రుజువు చేసింది.
ఇక ఈ సినిమా కలెక్షన్ల పరంగా కూడా సూపర్ హిట్గా నిలిచింది.ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.5.13 కోట్ల క్లోజింగ్ కలెక్షన్లు వసూలు చేసింది.ఏదేమైనా ఇంతకాలానికి అల్లరి నరేష్ అదిరిపోయే హిట్ అందుకోవడంతో ఆయనతో పాటు నాంది చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.
ఇక నాంది చిత్రం వరల్డ్వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్ ఏరియాల వారీగా ఈ విధంగా ఉన్నాయి.
నైజాం – 1.82 కోట్లు
సీడెడ్ – 59 లక్షలు
ఉత్తరాంధ్ర – 62 లక్షలు
తూర్పు – 41 లక్షలు
పశ్చిమ – 28 లక్షలు
కృష్ణ – 45 లక్షలు
గుంటూరు – 41 లక్షలు
నెల్లూరు – 23 లక్షలు
టోటల్ ఏపీ+తెలంగాణ – రూ.4.81 కోట్లు షేర్
రెస్టాఫ్ ఇండియా – 12 లక్షలు
ఓవర్సీస్ – 20 లక్షలు
టోటల్ వరల్డ్వైడ్ – రూ.5.13కోట్లు
.