టాలీవుడ్లో కామెడీ హీరోగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న అల్లరి నరేష్, చాలా రోజుల తరువాత హీరోగా బంగారు బుల్లోడు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.అయితే ఈ సినిమా కథలో పస లేకపోవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ మూవీగా నిలిచింది.
దీంతో తన నెక్ట్స్ చిత్రంపై చాలా నమ్మకాలు పెట్టుకున్నాడు ఈ హీరో.సీరియస్ కథతో వస్తున్న నాంది చిత్రాన్ని రిలీజ్కు రెడీ చేశాడు ఈ అల్లరోడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్లు నాంది చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేశాయి.ఈ సినిమాలో రిమాండ్లో ఉన్న ఓ ఖైదీ న్యాయం కోసం ఎలాంటి పోరాటం చేశాడు అనేది ముఖ్య కథగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తోంది.
ఈ సినిమాలో అల్లరి నరేష్ పర్ఫార్మెన్స్ అతడి కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ కాబోతున్నట్లు చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.ఇక ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్కుమార్ లాయర్గా అల్లరి నరేష్కు సహాయం చేసే పాత్రలో ప్రేక్షకులను మెప్పించనుంది.
ఇక ఈ సినిమాను ఎట్టకేలకు థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది.
ఈ సినిమాను ఫిబ్రవరి 19న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఈ సినిమాతో ఖచ్చితంగా హిట్ కొట్టి తీరుతామని నాంది చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.ఇక ఈ సినిమాను విజయ్ కనకమేడల అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేస్తుండగా ప్రియదర్శి పులికొండ, హరీష్ ఉత్తమన్, ప్రవీణ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు సతీష్ వేగేశ్న ప్రొడ్యూస్ చేస్తున్నాడు.మరి నాంది చిత్రంతో అల్లరి నరేష్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.