దర్శకుడు ఎన్.శంకర్‎కు భూకేటాయింపుపై హైకోర్టులో విచారణ..!

టాలీవుడ్ దర్శకుడు ఎన్.శంకర్‎కు తెలంగాణ ప్రభుత్వం భూమిని కేటాయించడంపై దాఖలైన పిటిషన్‎పై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది.

 Tollywood, Director N.shankar, Land, High Court, Telangana, Rangareddy,-TeluguStop.com

హైదరాబాద్‎లో సినీ స్టూడియో నిర్మాణం కోసం దర్శకుడు ఎన్.శంకర్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.దీంతో ప్రభుత్వం ఆయనకు రంగారెడ్డి జిల్లా శంకర్‎పల్లిలోని మోకిల్లాలో ఎకరాకు రూ.5 లక్షల చొప్పున ఐదు ఎకరాల భూమిని కేటాయించింది.అయితే ఎన్.శంకర్‎కు కేటాయించిన భూమి కోట్ల రూపాయలు విలువ చేస్తుందని.చౌకగా భూమిని ఏ విధంగా కేటాయించారంటూ కరీంనగర్ జిల్లా ధర్మపురికి చెందిన జె.శంకర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది.

రూ.2.50 కోట్ల విలువైన భూమిని ఎకరానికి రూ.5 లక్షల చొప్పున ఏ ప్రాతిపదికన కేటాయించారంటూ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.దీనిపై కేబినెట్‎లో నిర్ణయం తీసుకోవడానికి గల ప్రాతిపదిక ఏంటో చెప్పాలని హైకోర్టు కోరింది.

భూకేటాయింపులు ఓ పద్దతి ప్రకారం జరగాలని గతంలో సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని హైకోర్టు గుర్తు చేసింది.అయితే రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ క్వారంటైన్‎లో ఉన్నారని.

, తమకు కొంత గడువు కావాలని హైకోర్టును ప్రభుత్వం తరపు న్యాయవాది కోరారు.దీంతో తదుపరి విచారణ ఈ నెల 27వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube