టాలీవుడ్ దర్శకుడు ఎన్.శంకర్కు తెలంగాణ ప్రభుత్వం భూమిని కేటాయించడంపై దాఖలైన పిటిషన్పై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది.
హైదరాబాద్లో సినీ స్టూడియో నిర్మాణం కోసం దర్శకుడు ఎన్.శంకర్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.దీంతో ప్రభుత్వం ఆయనకు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలోని మోకిల్లాలో ఎకరాకు రూ.5 లక్షల చొప్పున ఐదు ఎకరాల భూమిని కేటాయించింది.అయితే ఎన్.శంకర్కు కేటాయించిన భూమి కోట్ల రూపాయలు విలువ చేస్తుందని.చౌకగా భూమిని ఏ విధంగా కేటాయించారంటూ కరీంనగర్ జిల్లా ధర్మపురికి చెందిన జె.శంకర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది.
రూ.2.50 కోట్ల విలువైన భూమిని ఎకరానికి రూ.5 లక్షల చొప్పున ఏ ప్రాతిపదికన కేటాయించారంటూ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.దీనిపై కేబినెట్లో నిర్ణయం తీసుకోవడానికి గల ప్రాతిపదిక ఏంటో చెప్పాలని హైకోర్టు కోరింది.
భూకేటాయింపులు ఓ పద్దతి ప్రకారం జరగాలని గతంలో సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని హైకోర్టు గుర్తు చేసింది.అయితే రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ క్వారంటైన్లో ఉన్నారని.
, తమకు కొంత గడువు కావాలని హైకోర్టును ప్రభుత్వం తరపు న్యాయవాది కోరారు.దీంతో తదుపరి విచారణ ఈ నెల 27వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.